పార్టీ కీలక నేతగా ఉన్న గన్నవరం
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అకస్మాత్తుగా పార్టీకి
రాజీనామా చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో
టీడీపీ ఎంపీ కేశినేని నాని చర్చించారు.అనంతరం కేసినేని ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ... రాజకీయంగా రాటు తేలడానికి పోరాడాల్సి ఉంటుందని... ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవడం సహజం అని ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పోరాడి గెలిచిన
వల్లభనేని వంశీ ఇప్పుడు వెన్ను చూపడం సరికాదని
ఎంపీ కేశినేని నాని అన్నారు. వల్లభనేని వంశీకి తాము చెప్పాల్సింది చెప్పామని ఇక తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపారు కేశినేని నాని.