ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని కొత్తపేటలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవంతిలో ఉన్న లాంగ్ లీవ్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అనే స్టోర్ లో బుధవారం అర్ధరాత్రి ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఇద్దరు మృతి చెందారు. ఈ పేలుడులో స్టోర్ యజమాని రామారావుతో పాలు మరో వ్యక్తి మరణించారు.  అయితే ఈ ప్రమాదం ఏసి గ్యాస్ నింపుతున్న సమయంలో జరిగి ఉండవొచ్చు అని  పోలీసులు భావిస్తున్నారు. 

మరోవైపు ఈ ప్రమాదం ఏసీ గ్యాస్ ఫిల్లింగ్ కారణంగా జరిగినట్టు కనిపించడంలేదని, సందేహించాల్సిందేనని ఏసీ మెకానిక్ లు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అర్ధరాత్రి సుమారు 2గంటల సమయంలో రెండు దఫాలుగా భారీగా బాంబు పేలిన శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. 

అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మరెవరూ లేకపోవడంతో ఇద్దరు మాత్రమే చనిపోయారు.  పేడు శబ్ధానికి చుట్టుపక్కల జనాలు భయ భ్రాంతులకు గురయ్యారు.  మరోవైపు అక్కడ క్లూస్ టీమ్ ఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తోంది.  కాగా, పోలీసు దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: