వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించి ఎవరికి ఎలా ఝలక్ ఇవ్వాలో వారికీ ఆలా ఇస్తుంటారు విజయసాయి రెడ్డి. ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకుపడుతుంటారు పడుతుంటారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయకత్వంపై విజయసాయి రెడ్డి వ్యంగ్యంతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి స్పందిస్తూ 'తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకుందంటే అక్కడ మీరు పాలన చేయలేదు కదా. మీరు సృష్టించిన ఇసుక మాఫియా పెడరెక్కలు విరిచి కట్టడానికి సీఎం జగన్ గారు కొత్త విధానం తీసుకొచ్చారు. దోపిడీ పాలన అంతమైందని తెలిసి ప్రకృతి కరుణించింది. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి, తేడా అర్థమైంది కదా చంద్రబాబు అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.


ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రశ్నించారు. ఓ నెటిజన్ ట్విట్ చేస్తూ 'సార్ గతంలో ఇసుక సమస్య గురించి & బాబుగారి ఇంటి పక్కన రిసార్ట్ హోటల్స్ కట్టాలని వేల ఇసుక బస్తాలతో నదిని పూడ్చేటప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీకు గానీ, జగన్ అన్నకు గానీ ఫోన్ చేశారా.! నిన్న పవన్ సార్ స్పెషల్ గా బాబు గారికి ఫోన్ చేసి మార్చ్ కి సహాయం చేయండి అన్నారు.!'  అంటూ ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం విజయసాయి రెడ్డి ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: