ఆలూ లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది గన్నవరం నియోజకవర్గం పరిస్థితి చూస్తుంది.
ఎమ్మెల్యే పదవికి,
టీడీపీ సభ్యత్వానికి
రాజీనామా చేస్తున్నట్లు
ఎమ్మెల్యే వల్లభవనేని
వంశీ చంద్రబాబుకు బహిరంగ
లేఖ రాశారు. అయితే ఆయన
ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు
రాజీనామా చేస్తారనేది క్లారిటీ లేదు. ప్రకటన చేసిన తర్వాత నుంచి ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆయన నుంచి కామెంట్స్ లేవు కానీ వాట్సాప్లో రాజీనామాకు కారణాలు చెప్పారు కానీ
ఎమ్మెల్యే పదవికి ఇంకా
రాజీనామా చేయలేదు. కానీ అంతలోనే
వంశీ రాజీనామాపై, గన్నవరం ఉప ఎన్నికపై ఊహగానాలు జోరందుకున్నాయి. ఉప ఎన్నిక వస్తే నేరుగా చినబాబే బరిలో దిగుతారని కొందరంటుంటే.. సేనాని యుద్దానికొస్తారని క్యాంపెయిన్ మొదలుపెట్టారు పార్టీల నేతలు. గన్నవరం నియోజకవర్గం
టీడీపీ సిట్టింగ్ సీటు, తెలుగుదేశానికి కంచుకోట. మొన్నటి ఎన్నికల్లో
వంశీ కేవలం 838 ఓట్ల తేడాతో
వైసీపీ అభ్యర్థి యార్గగడ్డ వెంకట్రావుపై గెలిచారు. ఇక్కడ జనసేన పోటీ చేయలేదు.
ఒక వేళ
వల్లభనేని వంశీ రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? అనే దానిపై పలు రకాలు ఊహగానాలు బెజవాడ రాజకీయ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ గన్నవరానికి ఉప ఎన్ని క వస్తే….. టీడీపీకి బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్న గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలో
నారా లోకేష్ పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి నడుస్తోంది. మాజీ
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా ఉప ఎన్నిక టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. కానీ ఆయన నందిగామ నుంచి మారే ముందు ఫ్యూచర్పై లోతుగా ఆలోచించక మానరు.
ఉప ఎన్నికలో
వంశీ ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారా? లేదా? అనేది సస్పెన్స్.
వైసీపీ ఇంచార్జ్గా
యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీ టికెట్ ఇవ్వకపోతే
టీడీపీ నుంచి పోటీ చేస్తారు అనే ఊహగానాలు ఉన్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్ల ఓటమి పాలైన జనసేనాని
పవన్ కల్యాణ్ కూడా గన్నవరం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపితో కాస్త సఖ్యతతోనే
పవన్ వుంటున్న నేపథ్యంలో పోటీకి దిగుతారా లేదా అన్నది సందేహమే.
మొత్తానికి
వంశీ రాజీనామా చేయలేదు. ఉప ఎన్నిక రాలేదు. కానీ పార్టీ అభ్యర్థుల విషయం చర్చించే వరకూ విషయం వెళ్లింది. అయితే అగ్గిరాజేసి సైలెంట్యైన
వంశీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.