మన దేశంలో రోజు పెరిగే వాటిలో జనాభాతో పాటు పెరుగుతూ పోయే వాటిలో ముందుగా అందరూ చెప్పే ఏకైక సమాధానం
పెట్రోల్, డిజిల్ అని. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అందరికి కాస్తో కూస్తో అవసరమైనది ఇది. ఎందుకంటే వీటి మీద ఆధారపడి చాలా అవసరాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు తగ్గాయి. శుక్రవారం
పెట్రోల్,
డీజిల్ ధరలు మరి ఎంత అంటే 3 పైసలు చొప్పున దిగొచ్చాయి. దీనితో హైదరాబాద్ లో లీటరు
పెట్రోల్ ధర రూ.77.51కు చేరింది.
డీజిల్ ధర రూ.71.78 కు తగ్గింది. మరో వైపు
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి.
అమరావతిలో కూడా
పెట్రోల్,
డీజిల్ ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. పెట్రోల్ ధర 3 పైసలు తగ్గుదలతో రూ.77.13 కు, డీజిల్ ధర కూడా 2 పైసలు క్షీణతతో రూ.71.09 కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.
పెట్రోల్ ధర 3 పైసలు,
డీజిల్ ధర 2 పైసలు తగ్గింది. దీంతో
పెట్రోల్ ధర రూ.76.77కు,
డీజిల్ ధర రూ.70.75కు చేరుకున్నాయి.
దేశ
రాజధాని అయిన ఢిల్లీలో కూడా
పెట్రోల్,
డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి.
పెట్రోల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.72.86 కు తగ్గింది.
డీజిల్ ధర కూడా 5 పైసలు తగ్గుదలతో రూ.65.80కు చేరింది. దేశ వాణిజ్య
రాజధాని ముంబయిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పెట్రోల్ ధర 3 పైసలు క్షీణతతో రూ.78.51 కు తగ్గింది.
డీజిల్ ధర కూడా 2 పైసలు తగ్గుదలతో రూ.68.99 కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్
ఆయిల్ ధర బ్యారెల్కు 0.10 శాతం పెరుగుదలతో 59.68 డాలర్లకు ధర చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.30 శాతం పెరగడంతో 54.34 కు ఎగసింది.