వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఎవరిపై ఎలా విరుచుకు పడాలో వారిపై ఆలా విరుచుకుపడుతుంటారు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్‌కు చంద్రబాబు మద్దతుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ ''ఇసుక కొరత పేరుతో ‘ఇస్కో... ఉస్కో’ అనడమే పరువు తక్కువ పని. మళ్ళి దానికి ఈయన సంపూర్ణ మద్ధతు ఇస్తారట. పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజి సమకూర్చడం నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా నిర్మాణం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ మీరే కదా. మళ్లీ సపోర్టు స్టేట్ మెంట్ ఎందుకో? ఎవరికీ తెలియదనుకుంటున్నాడు.'' అంటూ చంద్రబాబుని ఉద్దెశించి ట్విట్ పెట్టాడు విజయసాయి రెడ్డి. 


అయితే ఈ విషయంపైనే నిన్న కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యాడు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు అందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరు ఇద్దరే.. మీరు మొన్న అన్న మాట ఇప్పుడు వీళ్ళు నిజం చేశారు విజయసాయి రెడ్డి గారు అంటూ సంచలన ట్విట్ చేశారు. చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్ అని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని విజయసాయి రెడ్డి మొన్న సంచలన మాటలు అన్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: