రిలయన్స్ సంస్థ కొన్ని రోజుల క్రితం జియో ఫోన్ దీపావళి 2019 పేరుతో 1,500 రూపాయల విలువ చేసే జియో ఫోన్ ను 699 రూపాయలకు మూడు వారాల పాటు అందించిన విషయం తెలిసిందే. రిలయన్స్ సంస్థ ఆఫర్ కు అనూహ్య స్పందన రావటంతో ఈ ఆఫర్ ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కు అనూహ్య స్పందన వచ్చిందని ఊహించనంత డిమాండ్ వచ్చిందని రిలయన్స్ పేర్కొంది. 
 
రిలయన్స్ సంస్థ మరో నెలరోజులపాటు గడువు పెంచటంతో 2జీ ఫోన్ వినియోగించే వినియోగదారులు జియో 4జీ ఫీచర్ ఫోన్ ను కొనుగోలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేసింది. రిలయన్స్ సంస్థ జియో ఫోన్ దీపావళి 2019లో భాగంగా ప్రతి వినియోగదారునికి జియో 4జీ ఫీచర్ ఫోన్ పై 800 రూపాయల తగ్గింపుతో పాటు 700 రూపాయల విలువ చేసే డేటా అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా జియోఫోన్ కొనుగోలు చేసేవారు 1500 రూపాయల ప్రయోజనం పొందవచ్చు. 
 
వినియోగదారులు 808 రూపాయలు చెల్లిస్తే జియో ఫోన్ తో పాటు ఒక నెల రీఛార్జ్ కూడా పొందవచ్చు. 1006 రూపాయలు చెల్లిస్తే మూడు నెలల రీఛార్జ్ పొందవచ్చు. ఈ నెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్ కూడా ఉపయోగించుకునే వీలు ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం రిలయన్స్ సంస్థ సామాన్యుడి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో ఫోన్ ఉండాలనే ఆలోచనతో జియో ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొనివచ్చింది. 
 
ఈ నెల చివరివరకు ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. గతంలో ఆ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ ను ఇవ్వాలనే షరతు ఉండేది. ప్రస్తుతం ఎలాంటి షరతులు లేకుండానే రిలయన్స్ సంస్థ జియో ఫోన్ ను కేవలం 699 రూపాయలకు అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలంటే జియో ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందనటంతో సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: