విజయసాయి రెడ్డి
ట్విట్టర్ వేదికగా ట్విట్ చేస్తూ.. ''లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే
పవన్ కళ్యాణ్ ఇసుక ఆందోళనను
లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.'' అని ట్విట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఏపీలో ఇసుక కొరత.. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ విశాఖలో
లాంగ్ మార్చ్ కు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరి ఈ
లాంగ్ మార్చ్ ఎంతవరుకు
సక్సెస్ అవుతూందో చూడాలి.