బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే
విన్నర్ గా
రాహుల్ నిలిచారు. గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గానే ముగిసింది. ఫైనల్ కు మొత్తం ఏడుగురు కాంటెస్టులు మిగిలారు.
రాహుల్ ,
శ్రీముఖి,
బాబా భాస్కర్,
వరుణ్,
అలీ రెజా ఉన్నారు. ఎలిమినేషన్ మొదలవగానే ముందుగా
అలీ రెజా అవుట్ అయ్యారు. అయన వెనుక
హీరో వరుణ్ అవుటయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్లో చివరిగా
బాబా భాస్కర్ అవుటయ్యాడు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి
సైరా నరసిహారెడ్డి నటుడు
చిరంజీవి విచ్చేయడం గ్రాండ్ లక్ వచ్చిందనే చెప్పాలి. అందులోను చిరు, నాగ్ ల మధ్య జరిగిన మాటల ఛలోక్తులు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథికి
బిగ్ బాస్ కాంటెస్ట్ ల పరిచయ కార్యక్రమం చాలా ప్రోత్సహకారంగా సాగిందని చెప్పాలి. చిరు ప్రశంసలు ప్రతి ఒక్కరిని ఎంకరేజే చేసే దిశగా ఉన్నాయి.
వాస్తవానికి ఈ గ్రాండ్ ఫైనల్ ప్రోగ్రాం అసాంతంగా రసవత్తరంగా సాగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సినీ
హీరో వరుణ్ సందేశ్ ఎలిమినేటి అయ్యారు. ఆ తర్వాత
బాబా భాస్కర్ ఎలిమినేటి అయ్యారు. ఈ ప్రక్రియ నిర్వహణలో ముఖ్య అతిధిగా విచ్చేసిన నటి
అంజలి హౌస్ లో కాంటెస్టులను కంగారు పెట్టేసారు. ఆమెకన్నా ముందు వచ్చిన నటి
రాశి కూడా ఆహుతులను అలరించారనే చెప్పాలి. రాశిఖన్నా ఏకంగా బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ ఇచ్చింది. అనంతరం హౌస్మేట్స్తో కలిసి స్టెప్పులేసింది. పలువురు సినీరంగ ప్రముఖులు తరలి వచ్చి
బిగ్ బాస్ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. వీరికి తోడు మా టివి బుల్లి తెర నటీనటులు కూడా జతకట్టడంతో సందడి సందడిగా సాగింది. వారి అంద చందాలు, ఆటపాటలతో స్టేజ్ను కుదుపేశారనే చెప్పాలి.
చిరంజీవితో పాటుగా తరలి వచ్చిన
హీరో శ్రీకాంత్ కాంటెస్టులను ఆటపట్టించారు. ఈ క్రమంలో పునర్నవి తనకు ఇష్టమైన కంటెస్టెంట్ అని
శ్రీకాంత్ చెప్పడంతో ఆమె సిగ్గులు ఒలకబోసింది. ఈ విధంగా ఫినాలే కవ్వింపులతో ముగిసింది. సినీ తారలు
అంజలి, క్యాథరిన్,
రాశి ఖన్నా గ్రాండ్ ఫినాలేకు విచ్చేసి సందడి చేశారు. ఇస్మార్ట్ హీరోయిన్
నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్ కులకర్ణి పాడిన 'రాములో రాములా..' పాటతో స్టేజీ దుమ్మురేపారు. దీంతో
బిగ్ బాస్ ముగింపు ఘట్టం ఎపిసోడ్ ప్రేక్షకులకు టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ ని అందించిందనే చెప్పాలి.