ఈ కలియుగంలో ప్రతి మనిషిని నడిపించేది డబ్బు... డబ్బు మాత్రమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా ముందుకు అడుగువేసేలా చేస్తుంది. చేతిలో డబ్బు లేకుంటే.. మనిషి బ్రతుకు కూలీలా మారిపోతుంది. బండగా మారుతుంది. గానుగెద్దులా పనిచేయాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని చేస్తున్నా మనిషి మనిషిలా ఉండగలుగుతాడా అంటే చెప్పలేం. మనిషి జీవితం అంటే ఇంతే మరి. రెక్కడితేగానీ డొక్కాడని కుటుంబాలు ఈ దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. జీవితం కోసం జీతంపై ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి.
రెక్కాడితేగాని డొక్కాడని వ్యక్తికి కోట్ల రూపాయలు చేతికి వస్తే ఎలా ఉంటుంది. అసలు కలలో కూడా ఊహించనంత డబ్బు చేతికి వస్తే ఏం చేస్తాడు చెప్పండి. మాములుగా అంత డబ్బు చేతికి వస్తుంది అంటే కలగానే ఉంటుంది. ముందు ఎవరూ నమ్మరు. ఒకవేళా నిజమే అయితే.. డబ్బు విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి తప్పకుండా దానిని జాగ్రత్తగా చూసుకుంటారు. డబ్బును వృధా చేయకుండా అవసరాలకు తగినట్టుగా వాడుకుంటారు.
హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా అనే గ్రామానికి చెందిన
సంజీవ్ కుమార్ అనే పెయింటర్ కు కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చింది. ఎలా వచ్చింది అంటే.. అతను ఎందుకో తన దగ్గర ఉన్న డబ్బుతో పంజాబ్ స్టేట్ దివాలి బంపర్ ఆఫర్ లాటరీ కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. అది అతనికి షాక్.. అంతపెద్ద మొత్తంలో చేతికి డబ్బు వస్తుండటంతో.. ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు.
రోజువారీ కూలికి వెళ్ళి డబ్బు సంపాదించుకుంటున్నానని, ఒక్కసారిగా ఆ మొత్తంలో డబ్బు చేతికి వస్తుండటంతో ఇంకా
ప్లాన్ చేయలేదని, కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని
ప్లాన్ చేస్తానని అంటున్నాడు. పిల్లలను బాగా చదివిస్తానని అంటున్నాడు. డబ్బును వృధా చేయకుండా చూసుకుంటానని అంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు అదే లాటరీలో
కోటి రూపాయల
ప్రైజ్ వచ్చిన సంగతి తెలిసిందే.