చింతకాయల సన్యాసిపాత్రుడు హర్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.  సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడైన సన్యాసిపాత్రుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి పార్టీలో చేరానని, పార్టీ బలోపేతానికి తనవంతుఅభివృద్ధికి  కృషి చేస్తానని అన్నారు.

నామినేటెడ్‌ పదవుల పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు  50శాతం రిజర్వేషన్‌ కల్పించడం సంతోషమని అది చాల గొప్ప విషయమని , నర్సీపట్నంలో పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.


వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  చేరిన  గురించి ఏమన్నారంటే  రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీ పట్ల ప్రజావిశ్వాసం లేదని, అందుకే పార్టీలోకి నేతలు వలసలు వస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నవరత్నాలు, సంక్షేమ పథకాలతో  ప్రజలకు ఎంతో  మేలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు.. రాంగ్‌ మార్చ్‌ అని చెప్పడం జరిగింది . పవన్‌ కల్యాణ్‌ నడుస్తాడనుకున్నా.. కానీ సినిమా ఫక్కీలో అందర్నీ నడిపించి ఆయన మాత్రం కారుపై ఎక్కాడని ఎద్దేవా చేశారు. పవన్‌ టీడీపీ దత్తపుత్రుడని, చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ యాక్షన్ అని వ్యంగ్యంగా విమర్శించారు‌. పవన్‌ జీవితాన్ని చంద్రబాబుకు అర్పించాడని, లైఫ్‌ టైమ్‌ కాల్‌ షీట్స్‌ బాబుకు ఇచ్చేశాడని అన్నారు. పవన్‌ కల్యాణ్‌తో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని, ఆయన ఢిల్లీ నేతలను కలిసినా, అమెరికా అధ్యక్షున్ని కలిసి మాట్లాడినా ప్రజలు ఇక నమ్మరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: