పవన్ కళ్యాణ్ తాను బయట కూడా హీరోలా ఫీల్ అవుతున్నారు. అందుకే కాబోలు స్టేజి ఎక్కితే చాలు అందరి తాట తీస్తానంటూ విలన్ లకు వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నారు. ఇటువంటి మాటలు సినిమాల్లో చెబితే జనాలు చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తారు. కానీ నిజజీవితంలో కూడా పవన్ కళ్యాణ్ స్టేజి మీద అదే డైలాగ్స్ చెబుతుండటంతో పవన్ ను ఏమనాలో కూడా జనాలకు అర్ధం కావటం లేదు. రాష్ట్రంలో ఇసుక సమస్యల మీద .. భవన కార్మికుల తరుపున నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతీ తెలిసిందే. అది పేరుకే లాంగ్ మార్చ్నిజానికి కిలోమీటర్ కూడా లేదు. అంత దానికే పెద్ద పెద్ద పదాలు ఉపయోగించడం.


ఇక పవన్ కళ్యాణ్ అయితే కనీసం కారు కూడా దిగకుండా లాంగ్ మార్చ్ చేశారు. అయితే భహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎప్పటి మాదిరిగానే ఆవేశంగా .. పూనకం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడినారు. వైసీపీ నాయకుల తాట తీస్తా .. మూల కూర్చోబెడతా అంటూ పవన్ గారి ప్రసంగం సాగింది. దీనితో పవన్ మీద వైసీపీ ఓ రేంజ్ లో విరుచుకుపడింది. అయితే పవన్ స్పీచ్ లో భవన కార్మికుల గురించి చెప్పకుండా తన స్వంత డబ్బా ఎక్కువయిపోయిందని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. 


ప్రతి స్పీచ్ మాదిరిగానే ఈ స్పీచ్ లో కూడా పవన్ .. ప్రజల కోసం సినిమాలు వదిలేశానని, త్యాగం చేశానని పాడిందే మళ్ళీ పాడిండు. గత ఓటమి నుంచి పవన్ గారు ఏమి నేర్చుకోలేదని తేటతెల్లం అవుతుంది. పవన్ ఆవేశపూరిత స్పీచ్ తన అభిమానులకు నచ్చుతుందేమోగాని సగటు జనాలకు నచ్చదని ఎటువంటి సందేహం లేకుండా చెప్పాలి. ఒక రాజకీయనేత మాటల్లో ఏ మాత్రం ఆవేశం ఉండకూడదు. చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలి గాని .. స్వంత డబ్బా కొట్టుకుంటే ఎవరు మాత్రం వింటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: