రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జంగన్మోహన్ రెడ్డి రాచమార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. వాటిలో కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి సంగతులు బయటకి పొక్కడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ఉద్యోగాల కోసం ఎదురు చేసే యువతి యువకులకు చక్కటి వెసులుబాటును కల్సించినట్టు అయింది. 
అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్‌ సర్వీసెస్-ఆప్కోస్' పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. లాభాపేక్ష రహిత సంస్థగా ఇది పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఆప్కోస్ సంస్థను నడిపించేందుకు చైర్మన్‌తో పాటు బోర్డ్ ఆఫ్‌ డైరెక్టర్ల నియామకాన్ని ప్రకటిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి వ్యవహరిస్తారని.. డైరెక్టర్లుగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది.



కంపెనీల చట్టం 2013 సెక్షన్‌-8 ప్రకారం అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ సర్కార్ తన ఉత్తర్వుల్లో తెలియజేసింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.విజయవాడ కేంద్రంగా ఈ కార్పొరేషన్ విధులను నిర్వహించనుంది. నిర్వాహణ నిమిత్తం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల మూలధనం నిధిని సమకూర్చింది. ఈ విధంగా అవుట్ సోర్సింగ్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఏజెన్సీల బారినపడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకుండా ఈ కొత్త కార్పొరేషన్ పని చేస్తుందని ప్రభుత్వం వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: