పుడమి పై బ్రతికే ప్రతి జీవికి ఆహారం ఎంత ముఖ్యమైనందంటే, ఆహారాన్ని ఒక్కపూట తీసుకోకుంటే నీరసించిపోతాం. ఎందుకంటే పని చేసేటందుకు మనకు ఈ ఆహారం ద్వారానే శక్తి లభిస్తుంది. అలాంటి ఆహారాన్ని తీసుకోకుండా మనుషులతో పాటు ఏ జీవరాశి జీవించలేదు. ఇక అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటేనే శరీరం సహకరించదు అలాంటిది మొత్తానికి ఆహార పదార్ధాలు స్వీకరించకుండా బ్రతకడమంటే అది చాల కష్టమైన చర్య. దానికి ఎంతో సాధన చేసిన వారు మాత్రమే అలా ఉండగలుగుతారు అనే సమాధానాలు వినిపిస్తాయి.


కాని ఒక మహిళ దాదాపు 35 ఏళ్ళుగా ఆహారమే తీసుకోవడం లేదు. మరెలా బ్రతుకుతుందనేగా మీడౌట్. ఆమె టీ తో మాత్రమె బ్రతుకుతుందట. ఆశ్చర్యపోకండి ఆమె టీతోనే బ్రతుకుతుంది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో… కొరియా జిల్లాలోని బరదియా గ్రామానికి చెందిన 44 ఏళ్ల పిల్లిదేవి తనకు 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి అన్నం తినడం మానేసిందట. అయినా ఇంత వరకు ఏ చిన్న జబ్బు లేక, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారట. అయితే తాను మాత్రం ఒక్క బ్లాక్ టీ మాత్రమే తాగుతూ జీవితాన్ని గడుపుతుందట.


ఈ విషయం పై ఆమె తండ్రిని ప్రశ్నించగా, తన కూతురు ఆరవ తరగతి చదువుతున్న వయస్సు నుండే ఈ అలవాటు తనకు అబ్బిందని అప్పుడు మాత్రం రెండు బిస్కట్లు, వాటితో పాటు టీ మాత్రమె ఆహారంగా తీసుకునేదని వివరించారు. అయితే రెండు రోజులాగి తానే తినడం మొదలు పెడుతుందని అనుకున్నామని కాని అప్పటి నుండి తాను ఆహారం జోలికే వెళ్లడం లేదని, తాను అలా ఎలా బ్రతుకుతుందో తమకు ఏ మాత్రం అర్ధం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.


మొదట్లో బిస్కట్లు తిన్న తన కుమార్తె ఇప్పుడు కేవలం టీ తో మాత్రమె జీవితం గడుపుతుందని ఆయన వివరించారు. ఇకపోతే మొదట్లో నీళ్లు కూడా కనీసం తాగేది కాదని, ఇప్పుడు నీళ్ళు టీ తాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆమె అలా ఎందుకు చేస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పడం లేదట. దీనిపై వైద్యులు ఆరా తీసే ప్రయత్నం చేసిన లాభం లేకుందట. ఇకపోతే ఈ విషయం ఇప్పుడొక ట్రెండ్ గా మారింది. ఈ సంగతి తెలిసిన వారంతా ఆశ్చర్యంతో ఇలా ఉండటం ఎలా సాధ్యమని ఆరా తీస్తున్నారట..


మరింత సమాచారం తెలుసుకోండి: