మన భారతదేశ సంస్కృతి  ఎంత గొప్పదంటే అది ఈ మానవ విశ్వంలోనే ఘనతగాంచింది. అంతే కాకుండా, మన సంస్కృతి సాహిత్య సంప్రదాయలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతి చోట ప్రతిబింబిస్తాయి. ఇందులో ఉన్న  నైతిక విలువలు, నాగరికత విశిష్టతని ఎత్తిచూపిస్తాయి.  అవి జాతి ఔన్నత్యానికి ఆసరాయై అద్దంపడతాయి. ఇకపోతే మన సంస్కృతి ఆదినుండీ మానవతా పరిమళాలను వెదజల్లుతూ మానవునిలో మార్పును తీసుకొచ్చే మంచిని పెంచుతూ పంచుతూ ఆదర్శంగా ఆవిష్కృతమై అగ్రపూజనందుకుంటుంది. ఇంతటి చరిత్ర కలిగిన మన సంస్కృతిని దేశ విదేశాలు ఆదరిస్తున్నాయి.


ఈ దశలో  ప్రపంచంలో అసలైన మానవత్వం ఎక్కడుందని ఎవరైనా ప్రశ్నిస్తే అది ఒక్క భారతదేశంలోనే మిగిలి ఉందని, ఇప్పటి వరకు గర్వంగా చెప్పుకున్నాం. కాని ఈ మధ్యకాలంలో మనిషి ప్రతిష్టనే కాకుండా మానవత్వం అనే పదానికి కూడా అర్ధాన్ని మారుస్తున్నాయి సమాజంలో జరిగే కొన్ని కొన్ని దారుణఘటనలు. ఇక ‘అహింసా పరమో ధర్మః’ అన్నది మన వేదం. కాని ఇప్పటి మనుషులు మాత్రం హింస మార్గమే మాకు అన్నివిధాల ఆనంద దాయకం అనే చందాగా సాగుతున్నారు. ఇకపోతే ఇప్పుడు అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే విషయాలుగా మారాయి.


ఇలాంటి వాటిలో ఎక్కువగా వ్యభిచారం, అక్రమ సంబంధాలు. వీటివల్ల సమాజంలో ఎన్ని దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మనిషిలోని కోరికలు మానవున్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తున్నాయి. ఆ కోరికల మూలాన క్షణికమైన సుఖం కోసం చేయకూడని చెడు పనులు చేస్తూ తాను మనిషిని అన్న విషయాన్నే మరచి ఒకరినొకరు చంపుకునే విధంగా తయారవుతున్నారు.


ఇకపోతే మరో దారుణమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త గొంతుకోసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి .. ఈ ఘటనలో  భార్య పరిస్థితి విషమంగా ఉండగా ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఇకపోతే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ దారుణానికి కారణం అక్రమ సంబంధమనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: