మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత వివేక్ వెంకటస్వామి మంగళవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం అయిన తర్వాత కేసీఆర్ 23 మంది ఇంటర్ విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు.


శవ రాజకీయాలు చేసేన  కేసీఆర్ .. ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారుల శవాలపై నడిచి వెళ్లి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. 30 మంది RTC  కార్మికుల మరణానికి కారణం ప్రభుత్వమేనని తెలిపిన ఆయన .. rtc కార్మికులకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పారు. సుంప్రీంకోర్టుకైనా వెళ్లి ఒక్క ఉద్యోగి ఉద్యోగం పోకుండా పోరాడుతామన్న వివేక్… ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.


కాకా వెంకటస్వామి గుంచి మాట్లాడిన వివేక్.. నా తండ్రి దైర్యంగా న్యాయం కోసం కొట్లాడే వ్యక్తి.. వారు మాకు అదే నేర్పారు. దళిత గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు… కాకా వల్ల హైదరాబాద్ లో గృహాలు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు.  దళితులు అభివృద్ధి చెందాలంటే అందరూ మంచి విద్యానభ్యసించాలని  విద్యాసంస్థలు స్థాపించి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు.
అత్యంత పేద విద్యార్థులు చదువుకుంటున్న మా అంబేడ్కర్ లా కాలేజ్ అల్ ఇండియా 23rd స్థానంలో ఉంది.

ప్రతి ఒక్కరూ అంబెడ్కర్, కాన్షిరాం, కాకా చూపించిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నన్ను అణచివేయడానికి. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ నా తండ్రి ఇచ్చిన ధైర్యంతో తెలంగాణ సాదించాము.  ప్రయివేటు సెక్టార్ లలో పెన్షన్ లు ప్రవేశ పెట్టిన గొప్ప వ్యక్తి కాకా అని గుర్తుచేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనాడు ఉద్యమం సమయంలో ఊపిరి పోసిన వ్యక్తి కాకా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు.. ముఖ్య కారకులు ఆ నాడు ఎంపీ లుగా పనిచేసిన వారిమే’. అని తెలిపారు వివేక్ వెంకటస్వామి.



మరింత సమాచారం తెలుసుకోండి: