రాష్ట్రం విడిపోయి తీవ్ర లోటు బడ్జెట్ తో సతమవుతున్న సమయంలో జగన్ ఏపీకి సీఎం అయ్యారు. గత టీడీపీ ఐదేళ్ల పరిపాలనలో పూర్తి అప్పులతో రాష్ట్రం ఇంకా ఇబ్బందుల పాలైంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో కేంద్రం సహాయం ఎంతైనా అవసరమని చెప్పాలి. జగన్ ఇప్పటికే కేంద్రం సహాయం కోసం పలు సార్లు ఢిల్లీకి వెళ్లి మోడీకి .. అమిత్ షా కు విన్నవించుకున్నారు. ఇప్పుడు  జగన్ తాజాగా మోడీకి లేఖ రాశారు. విభజన సమస్యలు ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన వాటి విషయంలో ఇప్పటికే పలు సార్లు కేంద్రానికి విన్నపాలు చేస్తూ ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విభజన హామీల అమలు ఏపీకి ద్రవ్యలోటు వంటి అంశాల గురించి కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు.


కానీ జగన్ విన్నపాలు ఎన్ని చేసినా కేంద్రం ఇప్పటి వరకు అమలు దిశగా ఏ పనిని చేయలేదు. కనీసం చట్టంలో పేర్కొన్న విభజన అంశాలను కూడా కేంద్ర సర్కార్ పెడ చెవిన పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో మరోసారి ప్రధాని దృష్టికి అంశాలను తీసుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్.అందులో భాగంగా తాజాగా ఆయన ఒక లేఖ రాశారు. ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి బొగ్గు గనులూ కేటాయించని విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజనతో సింగరేణి పూర్తిగా తెలంగాణ పరమైంది.


దీనితో ఏపీకి కేంద్రం ఎటువంటి బొగ్గు నిల్వలు కేటాయించలేదు. ఇప్పడూ ఏపీలో దాని మూలంగానే కరెంట్ కోతలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని కోరుతున్నారు. ఈ మేరకు లేఖ రాశారు.  ఏపీలో రాజకీయంగా బలోపేతం అంటూ కలలు కంటున్న బీజేపీ వాళ్లు.. ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడరో! మరో పక్క రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఛోటా మోటా నాయకులూ ఓవర్ యాక్షన్ డైలాగ్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: