ఢిల్లీలో పెరిగిపోతున్న తీవ్ర కాలుష్యం ఇప్పుడు ప్రజలకు ఎక్కడ లేని ఆరోగ్య ఇబ్బందులను తెచ్చి పెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో బతకాలంటే చాలా కష్టమని ఇప్పటికే చాలా మందికి అర్ధం అయింది. మరో పక్క ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కాలుష్యాన్ని నివారించలేకపోతుంది. సాధారణంగానే ఢిల్లీ లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది ..దానికి తోడు ఈ మద్యే దీపావళి పండుగ కూడా రావడం తో కాలుష్యం ఒక్కసారిగా పీక్  స్టేజ్  కి చేరింది. దీనితో ఢిల్లీ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీనితో కొంతమంది ఢిల్లీ లో ఇక మేము ఉండలేము బాబోయ్ అంటూ ఢిల్లీ నుండి దుకాణం సర్దేస్తున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.


ఢిల్లీలో తీవ్ర కాలుష్యం దృష్ట్యా పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ సమయంలో  మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ లో నెలకొన్న కాలుష్యపరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని చెప్పుకొచ్చారు.  తెలుగు వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇంతక ముందు మునుపు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చాలా మంది చేసినా .. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీ మాజీ గవర్నర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే ఢిల్లీ లో ప్రభుత్వం సరి బేసి విధానాన్ని మళ్ళీ  అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానంతో కొంత వరకు కాలుష్యం నుండి బయటపడినా పూర్తి స్థాయిలో మాత్రం గాలి స్వచ్ఛతను అందుకోలేదు . మరోవైపు దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: