మెజారిటీ వాటాదారుల అనుమతి లేకుండా ఒక వ్యాపారసంస్థ తన రూపురేఖలని విధివిధానాలను మార్చలేరు. అదే పాయింట్ లేవనెత్తి టిఎస్ ఆర్టీసి జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆర్టీసి ప్రైవేటీకరణ రాష్ట్రప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేదికాదు. దీనిపై నిర్ణయం తీసుకొనే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని ఢంకా బజాయించి చెపుతున్నారు. 


చర్చల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేది కాదు. 31 శాతం కేంద్ర వాటా ఉంది. సంస్థను మార్చాలంటే ఒక ప్రధాన వాటా దారైన కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కేంద్రం అనుమతి లేకపోతే ఎలాంటి మార్పు చేయలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. చట్టం ద్వారా కార్మికులకు రక్షణ ఉంటుంది. ఎవరూ భయపడవద్దు. ఏ ఒక్క కార్మికుడు కూడా ఉద్యోగంలో చేరలేదు. ఉద్యోగంలో చేరిన వారు మళ్ళీ వెనక్కి వస్తున్నారు" అని అన్నారు అశ్వత్థామరెడ్డి.


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఎలాంటి తీర్పువచ్చినా సుప్రీంకు వెళ్తామని సీఎం కేసీఆర్‌ బెదిరిస్తున్నారని, కార్మికులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తాము ఖండిస్తు న్నామని  అన్నారు. నేడు (మంగళవారం) జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  భైంసాలో తాత్కాలిక ఉద్యోగులు డిపో మేనేజర్ పై దాడి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. ఇంత మంది కార్మికులు చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం ఏ ఒక్కరు కూడా సానుభూతి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


మానవతా దృక్పథంతో తాము ఈ ఘటనను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి అనుచరుడు ఒకరు సిబ్బందిని తీసుకొని వెళ్ళి డిపో వద్ద దింపడం సిగ్గు చేటని విమర్శించారు. సమ్మెకు మద్దతుగా 7 న పెన్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడుతామని, చలో ట్యాంక్ బండ్ విజయవంతం చేయమని కొరతామని జేఏసీ నేతలు వెల్లడించారు. 


ఆర్టీసి ఉద్యోగులు 48000 మందిని సామూహికంగా సెల్ఫ్ డిస్మిస్స్ అంటూ నోటిమాటతో పదవుల నుంచి తొలగించిన కేసీఆర్ కు మానవత్వం ఏ కోశానలేదని - అయినా ఒక సారి ఉద్యోగం నుండి అందరిని సెల్ఫ్ డిస్మిస్ అంటూ తొలగించిన ఉద్యోగులను నేటి అంటే ఐదవ తారీఖు అర్ధరాత్రి లోగా జాయిన్ అవ్వకపోతే శాశ్వితంగా ఉద్యోగాలను కోల్పోయినట్లేనని అనటంలో ఉన్న పవిత్రతేముంది అని పదుగురు అక్కడ మాట్లాడటం వినిపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: