కాబోయే భర్త సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచనే ఆమె పాలిట శాపమైంది . సెల్ఫీ దిగుతూ కాలు జారీ బావిలో పడి మృతి చెందింది . తమిళనాడు లోని పట్టాభిరామ్ ప్రాంతం లోని గాంధీ నగర్ కు చెందిన టి మెర్సీ స్టెఫీ కి నవజీవన్ నగర్ కు చెందిన అప్పూ తో ఇటీవల నిశ్చితార్ధం అయింది . జనవరి లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు . అప్పూ , స్టెఫీ లు సరదాగా గడిపేందుకు వారి పొలానికి వెళ్లారు . పొలం పరిసరాల్లో ఒక పాతబావి ఉంది . బావి వద్ద ఇద్దరు కలిసి ఫొటోలు తీసుకున్నారు .


ఇంతవరకు అంతాబాగానే ఉంది కానీ సెల్ఫీ దిగాలన్న ఆలోచనే స్టెఫీ పాలిట శాపంగా పరిణమించింది . ఇరువురు కలిసి చెరో మెట్టుపై కూర్చొని సెల్ఫీ తీసుకునే ప్రయత్నం లో స్టెఫీ బావిలో పడిపోయింది . ఆమెను కాపాడే ప్రయత్నం లో అప్పూ కూడా బావిలో పడిపోయాడు . బావిలో పడిన వెంటనే అప్పూ భయం తో కేకలు వేయడం తో పక్కనే ఉన్న రైతులు వచ్చి , బావిలో పడిన అప్పూ ను ప్రాణాలతో కాపాడారు . స్టెఫీ మాత్రం అప్పటికే చనిపోయింది .  సెల్ఫీ తీసుకునే ప్రయత్నం లో  పలువురు మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ , ప్రమాదకర పరిస్థితుల్లో యువత సెల్ఫీ లు దిగడం మాత్రం మానడం లేదు .


ఎదుటి వారి ప్రాణాలపైకి వచ్చినట్లుగానే , తమ ప్రాణాలపైకి కూడా వస్తుందేమోనన్న ధ్యాస లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు . పాడుబడిన బావి అని తెలిసి కూడా చెరొక మెట్టుపై కూర్చొని స్టెఫీ , అప్పూ లు సెల్ఫీ తీసుకునే ప్రయత్నమే చేసి ఉండకపోతే ఆ ఇంట విషాదం మిగిలేది కాదని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: