ఈ మద్య ఆడవాళ్లపై లైంగిక దాడులు, అత్యాచారాలు..దారుణమై హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ దారుణమైన వార్తలు వింటూనే ఉన్నాం..మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో మానవ మృగాలు చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు.
వరంగల్ లో తొమ్మిదినెలల పసిపాపపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపిన ఘటన వెలుగు లోకి వచ్చింది..ఆ తర్వాత ఏపిలో చిన్నారిపై అత్యాచారం హత్య..ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యల్లో ఇలాంటి నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి నేరాలు కట్టడి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత ప్రయత్నిస్తున్నా..కామంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు.
తాజాగా ఓ మానవ మృగం..అసలు వీడిని తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో అవన్నీ తిట్టినా తక్కువే అని చెప్పాలి. ఓ తండ్రిగా కన్న కూతుళ్లను ఎంతో గౌరవంగా సాకి..ఓ అయ్య చేతిలో పెట్టి ఆ కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కామాంధుడై సిగ్గు..మానం వదిలేసి కూతురుపైనే ఏడాదిగా అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపూర్కు చెందిన ఓ వ్యక్తికి
భార్య, ముగ్గురు ఆడపిల్లలు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు.
భర్త ప్రవర్తన నచ్చక అతని
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆ ముగ్గురు కూతుళ్లు తండ్రి వద్దనే పెరుగుతున్నారు.
కొంత కాలంగా
భార్య దూరం కావడంతో ఆ దుర్మార్గుడి కన్న కన్న కూతుళ్లపైనే పడింది. తన కామవాంఛ తీర్చుకునేందుకు రాత్రి పూత పెద్ద కూతురుకి మత్తు మందు ఇస్తూ..అత్యాచారం చేస్తూ ఉండేవాడు..తాను అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసుకొని మిగతా ఇద్దరు కూతుళ్లకు చూపించి తాము కూడా ఇలా చేయాలని బలవంతం పెట్టేవాడు. తమ తండ్రి చేస్తున్న దారుణ కృత్యాలకు ఆడపిల్లలు గజ గజ వణికిపోయేవారు. ఈ మద్య మూడో కూతురు ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఓ సందర్భంలో ఇంటి యజమానురాలు ఆమె తండ్రి గురించి అడిగితే భయంతో వణికిపోయింది.
తండ్రి పేరు చెబితే ఇంతలా భయపడిపోతున్న ఆ అమ్మాయిని చూసి యజమాను రాలికి అనుమానం రావడం..తండ్రి గురించి ఆరా తీయడం..పిల్లలను ప్రశ్నించడంతో అసలు విషయాలు బయటకు రావడంతో నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెద్ద కుమార్తెను విచారించి ఆమె చెప్పిన ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.