చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రామ్ విలాస్ పాశ్వాన్ 2000వ సంవత్సరంలో ఎల్జేపీని స్థాపించిన సీనియర్ నేత,ఆయన దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్గా కొనసాగారు. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చారు , మంగళవారం చిరాగ్ పాశ్వాన్ను నూతన అధ్యక్షుడిగా పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుందని ఆయన ప్రకటించారు.
రెండు పర్యాయాలు లోక్సభకు ఎన్నికైన చిరాగ్ కొంతకాలంగా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.బిహార్
అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నయి కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిరాగ్ను ఎల్జేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలందరూ‘యువ నాయకత్వం కోసం పట్టుబట్టారు. ఎంపీలు కూడా దీనికి మద్దతు ప్రకటించారు.
రామ్విలాస్ పాశ్వాన్ ఈ విధంగా తన కుమారుడి గురించి చెప్పుకొచ్చారు ...ఏమిటంటే "పేదలు, నిమ్నవర్గాలకు న్యాయం జరిగేలా పార్టీని చిరాగ్ నడిపిస్తాడని నాకు నమ్మకముంద’ని" అని అన్నారు. దీన్ని బట్టి తన కుమారిడిపైన అపార నమ్మకంతోను ,ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అయన భావనను బయటపెట్టాడు.
మీడియాకు చిరాగ్ పాశ్వాన్ సంస్థాగతంగా ఎల్జేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తమ పార్టీ సంబంధిచి
బీజేపీ కి
లేఖ రాసినట్టు తెలిపారు అస్సలు ఆ లేఖలో ఏమి రాసారంటే " త్వరలో జరగనున్న జార్ఖండ్
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి
లేఖ రాసినట్టు వెల్లడించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్లో ఎల్జేపీ కేవలం ఒకచోట మాత్రమే పోటీ చేసింది కనుక ఈసారి కనీసం తమ పార్టీ తరుపున ఆరుగురు పోటీ చేయాలనీ చిరాగ్ పాశ్వాన్ బీజేపీని కోరడం జరుగింది.