ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడిసిపోయింది. అయితే ఇంత వరకు స్థానిక ఎన్నికలు జరగలేదు. అయితే ప్రభుత్వం కోర్టుకు చెప్పిన ప్రకారం మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలుస్తుంది. దీనితో మిగతా పార్టీలు ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టినాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుండి కోలుకోలేక పోతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఎన్నికల నగరా మోగబోతుండటం తో పాత జ్ణాపకాలని మరచిపోయి మళ్ళీ కొత్త ప్రణాలికలతో ఎన్నికల బరిలో దిగడానికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.


అయితే కొన్ని రోజుల క్రితం స్థానిక ఎన్నికలు జరిపించాలని కోర్ట్ లో పిటీషన్ దాఖలు అయిన సంగతీ తెలిసిందే. దీనితో మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణ మూర్తి హైకోర్టులో  పిల్ వేశారు. దీనితో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై విచారణ జరిపింది.


దీనితో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం మరో మూడు నెలలో ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రకటించారు. బీసీలకు 34 శాతం ఎస్సీలకు 19.08 ఎస్టీలకు 6.77 శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్ల పై రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: