పవన్ కళ్యాణ్ అంటేనే కస్సున లేచే కత్తి మహేష్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మరో మారు పవన్ మీద కత్తి దూశారు. ఈ సారి మరో ఘోరంగా పవన్ ఏరా అంటూ సంబోధిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. దీనితో కత్తి మహేష్ మళ్ళీ పవన్ ను టార్గెట్ చేశాడా అని అందరికీ సందేహం వస్తుంది. విశాఖలోని జనసైనికులతో భేటీ సందర్భంగా.. వారిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పవన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై కత్తి మహేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ రాజధానిని పులివెందులలో.. హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయిన కత్తి మహేశ్ ఘాటుగా రియాక్ట్ అవుతూ.. ఏరా పవన్ అంటూ సంబోధనతోనే వివాదాగ్నిని రగిల్చారు.


ఇప్పటికే పవన్ వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులూ ప్రెస్ మీట్ లో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.  ఇలాంటివేళ.. వారికంటే పది అడుగులు ముందుకు వేసిన కత్తి మహేశ్.. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.'ఏరా పవన్ కళ్యాణ్... పులివెందులలో రాజధాని కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.


అయితే కత్తి మహేష్ వ్యాఖ్యల పట్ల నెటిజన్స్ .. ఇదేమి భాష అని ఇటువంటి భాష ను ప్రయోగించవద్దని సుతిమెత్తగా చెబుతున్నారు.  పవన్ లాంటి బాధ్యత లేని బరితెగించిన బానిసకు ఇంతకు మించిన మంచి బాష తన దగ్గర లేదన్నారు.నిజానికి తాను చాలా మర్యాదగానే ఇప్పటికి పోస్టులు పెడుతున్నానంటూ సెలవిచ్చారు. విశాఖ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటివరకూ తీస్తా.. తీస్తా అని అనటమే కానీ వాడు తీసిన తాటా లేదు.. తోలూ లేదు. తొక్కా లేదు.. చిల్ చిల్.. అల్రెడీ వాడిగా వాడి గుండు ఒకసారి.. వేడిగా ఓటమి రెండుసార్లు తగిల్చి జనాలే తేల్చేశారు.. ఇక ఆపమనండి మాడా యవ్వారాలు.. అంటూ కస్సుమన్నారు కత్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: