స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. అనేది ఓ సినిమాలో హిట్ పాట. తమ స్నేహితుల కోసం ఎంతటి సాహసం అయినా చేస్తారు. కానీ స్నేహం కోసం తన ప్రాణాన్ని బలి తీసుకోవటం మాత్రం ఎక్కడా విని ఉండం. అది కూడా తోటి స్నేహితులు తనతో మాట్లాడటం లేదనే బాధతో ఆత్మహత్య చేసుకోవడం విచిత్రమే. బాధ కలిగించే ఈ సంఘటన తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో జరిగింది.

 


అనంతపురం జిల్లా చెర్లో పల్లి మండలంలోని మద్దిపల్లికి చెందిన వేణు గోపాల్.. తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. తన తోటి స్నేహితులు తనతో మాట్లాడుకుండా ఉండటాన్ని వేణుగో పాల్ తట్టుకోలేక పోయాడు. అప్పటి వరకూ స్నేహంగా తిరిగిన తన స్నేహితులు మాట్లాడకుండా ఉండటం ఎదురుగా ఉన్నా తనను దూరంగా పెట్టడం సహించలేకపోయాడు. దీంతో తను ఉంటున్ హాస్టల్ బాత్‌రూమ్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన మూడు పేజీల లేఖ విస్తుగొలుపుతోంది. తాను ఎంతో స్నేహంగా ఉండే తన మిత్రుడు హేమంత్ తనను దూరం పెట్టడంతో వేణు గోపాల్ తట్టుకోలేకపోయాడు. పైగా కొత్తగా పరిచయం అయిన అమ్మాయిల విషయంలో హేమంత్ తనను దూరం పెట్టడం మరింత బాధించింది. దీంతో ఈ ఘోరానికి పాల్పడ్డట్టు దొరికిన లేఖ ఆధారంగా తెలుస్తోంది.

 


పైగా లేఖలో.. ‘స్నేహం నేను ఏమీ ఇవ్వలేనని అన్నారుగా.. ఇందుకోసం నా ప్రాణమే ఇస్తున్నా’అంటూ తన ఆవేదనను తెలియపరిచాడు. ఈ లేఖ చదివిన వారికి కొన్ని స్నేహాల వల్ల చెడిపోయేవారిని చూశాం కానీ.. స్నేహం కోసం ప్రాణం తీసుకోవడం కలచివేస్తోంది. స్నేహితుల కోసం తన ప్రాణం తీసుకోవడం కలచివేస్తోందని సన్నిహితులు అంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: