దక్షిణ కొరియా హీలింగ్‌ సెంటర్లు జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు  సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ఈ సరికొత్త విధానం ఏమిటంటే  ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’   నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వున్నా వారి జీవితాన్ని  కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు  చేసుకునే వారి సంఖ్య రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు.


ఈ క్రమంలో హీలింగ్‌ సెంటర్లు 2012 నుంచే అధిక సంఖ్యలో  ఏర్పడ్డాయి .  వీటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనిషి ప్రాణాలతో  ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఒక ఆశ కల్పించడమే. ఈ నేపథ్యంలో హైవోన్‌ అనే హీలింగ్‌ సెంటర్‌ మంగళవారం ‘డైయింగ్‌ వెల్‌’  పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్‌ ఫర్నియల్‌’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. 


ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది మనకు ఉపయోగపడుతుందని  పేర్కొన్నాడు.ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్‌ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను అని చెప్పారు.ఈ కార్యాక్రమాన్ని దాదాపు 2012 నుండి నడుపుతున్నాం  ఇందులో ఇప్పటివరకు 25 వేల  మంది పాల్గొన్నారు అని చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: