డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకునే నిర్ణయాలు పలుసార్లు వివాదస్పదంగా మారాయి. ఇకపోతే సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే వలసదారుల పట్ల కఠిన నిర్ణయాలను అమలు చేసిన ట్రంప్‌ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.. ఇందులో భాగంగా ఇప్పటికే హెచ్-1బి వీసాలు పొందడంలో భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ పడుతోంది.


ఆందోళన కలిగించే విషయం ఏంటంటే వివిధ దేశాల నుంచి వస్తున్న దరఖాస్తుల్లో భారత్‌కు చెందిన వీసాలే 90 శాతం తిరస్కరణకు గురవుతు ఉండటం. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్-1బి వీసాల జారీలో అమెరికా కఠినంగా వ్యవహారిస్తున్నది. దీంతో ఈ 15-20 ఏళ్ళ కాలంలో భారత్‌కు చెందిన వీసాలే ఎక్కువగా తిరస్కరణకు గురవడం గమనార్హం. ఇక అమెరికాలో పని చేయడానికి అవసరమయ్యే హెచ్-1బి వీసా జారీలో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నియమ, నిబంధనలు కఠినతరం చేసింది.


ఇకపోతే భారతీయ కంపెనీల హెచ్-1బి దరఖాస్తులు అత్యధికంగా తిరస్కరణకు గురవడానికి కారణం వీసాల కోసం వచ్చే దరఖాస్తుదారుల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన సమాచారాన్ని అందించడం లేదని అమెరికా అంటున్నది. కానీ డోనాల్డ్ ట్రంప్ మన కంపెనీల పట్లనే కఠినంగా వ్యవహారిస్తున్నారని భారత్‌కు చెందిన కంపెనీల యజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో ఫేస్‌బుక్, యాపిల్ వంటివి సమర్పించిన హెచ్-1బి దరఖాస్తుల్లో ఒకటి, రెండు శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి.


మైక్రోసాఫ్ట్, అమేజాన్, ఇంటెల్ సంస్థల వీసాలు కూడా చాలా తక్కువగా అంటే మూడు, ఆరు, ఏడు శాతానికి మించి లేవు. వీసాల జారీ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహారిస్తున్నందున అక్కడ ఉన్న మన కంపెనీలపై ప్రభావం పడుతున్నది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేయడంతో మన దేశానికి చెందిన కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకు కారణం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన ఇంజనీర్లను, ఇతర ఉద్యోగులను భారత్ నుంచే ఎంపిక చేసుకుని పిలిపిస్తుంటాయి. ఒకవైపు నీతులు చెబుతూనే ట్రంప్ లేపే కంపు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: