ఈ కాలంలో ఆడవారి శవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మొన్న తెలంగాణలోనే ఓ ఆవు దూడపై అత్యాచారం చేశాడు ఓ కామాందుడు. నిన్న ఓ పిల్లిపై అత్యాచారం చేసి దాన్ని చంపాలని మైనం పోసి హింసించాడు. ఇప్పుడు చచ్చిన ఆడది అని కూడా చూడకుండా.. భూమిలో ఉన్న శవాన్ని తీసి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.   

                   

ఈ దారుణమైన ఘాటున పాకిస్తాన్ లో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో కామాంధుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి ఆమెపై అత్యాచారం చేశారు కొందరు దొండగులు. అయితే ఈ ఘటన పాకిస్తాన్‌లోని లోథీ అనే పట్టణంలో జరిగింది. 

                 

ఓ యువతీ చనిపోతే ఆమెను గత శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే, మరుసటి రోజు శ్మశానానికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులు ఆమెను ఖననం చేసిన ప్రేదేశాన్ని చూస్తే అక్కడ మట్టి తవ్వేసి ఉంది. ఆమె మృతదేహం బయటపడి కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె మృతుదేహాన్ని పోస్టుమార్టం చూపించగా ఆమెపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు తెలిపారు. 

                 

దీంతో అక్కడే ఉన్న శ్మశానవాటిక కాపలాదారుడిని ప్రశ్నించగా ఓ కుక్క వచ్చి ఆ సమాధిని తవ్వింది అంటూ చెప్పాడు. అయితే కుటుంబసభ్యులు మాత్రం అంత పెద్ద రాయిని కుక్క ఎలా జరుపుతుంది అంటూ ప్రశ్నించారు. మరి నిజానిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: