వ‌రుస‌గా ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ డైలాగులు కొడుతూ రాజ‌కీయంగా కాల‌క్షేపం చేయ‌డం టీడీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్‌రెడ్డికి అల‌వాటు అయిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు, జేసీ ఎంపీగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు మెప్పుకోసం అప్పుడు జ‌గ‌న్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన జేసీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్నో వేదిక‌ల మీద ఆయ‌న ప్రాప‌కం కోసం జ‌గ‌న్‌ను తిట్ట‌డంతో చంద్ర‌బాబు ముసిముసి న‌వ్వులు న‌వ్వేవాడు.
ఇలా ఎన్నోసార్లు జ‌రిగింది.

ఎప్పుడైతే ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిందో ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి చూసి జేసీకి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిన‌ట్లుంది. వెంట‌నే జ‌గ‌న్, వైసీపీ నేత‌ల ప్రాప‌కం కోసం నానా పాట్లు ప‌డుతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. జేసీ టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సుల‌కు ప‌ర్మ‌ట్లు, అనుమ‌తులు లేకుండా ఇష్టానుసారంగా తిప్పేసుకుని వ్యాపారం చేసుకున్నారు.


ఇప్పుడు వైసీపీ గెల‌వ‌డంతో జేసీ అక్ర‌మ ట్రావెల్స్ దందాకు బ్రేక్ ప‌డింది. ఇప్పటికే జేసీ బ్రదర్స్ కు చెందిన బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దివాక‌ర్ ట్రావెల్స్‌కు చెందిన 28 బ‌స్సుల‌ను అధికారులు సీజ్ చేయ‌డంతో పాటు వాటి ప‌ర్మిట్ల‌ను ర‌ద్దు చేశారు. ఇక నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం, ప‌రిమితికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకోవ‌డంతో పాటు ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం.. ఒకే ప‌ర్మిట్‌తో మూడు నాలుగు బ‌స్సుల‌ను తిప్పేయ‌డం ఇలాంటి అక్ర‌మాల‌కు జేసీ ట్రావెల్స్ పెట్టింది పేర‌న్న సంగ‌తి తెలిసిందే.


తాజాగా ఏపీ మంత్రి పేర్రి నాని జేసీ దివాక‌ర్‌రెడ్డికి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయంగా చివ‌రి ద‌శ‌లో ఉన్న జేసీతో మాకు ప‌నేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జేసీ రాజ‌కీయ అవ‌స‌ర‌ల కోస‌మే ఆయ‌న లేనిపోని అవాకులు చ‌వాకులు పేలుస్తున్నార‌ని మండిప‌డ్డారు. అస‌లు ఆయ‌న్ను వైసీపీలో చేరాల‌ని ఎవ్వ‌రూ ఆహ్వానించ‌లేద‌ని కూడా చెప్పారు. ఇక చివ‌రి ద‌శ‌లో ఉన్న జేసీ అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని చెప్ప‌డం ద్వారా వైసీపీ జేసీని ఎంత‌లైట్ తీస్కొంటుందో చెప్ప‌క‌నే చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: