సమాజంలో రోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది. మృగాళ్ల  మారుతున్న మగాళ్ల  నుంచి ఆడవాళ్లకు రక్షణ కరువవుతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. మహిళలు బయట కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అత్యాచారం చేసిన వాళ్లకి కఠిన శిక్షలు పడుతున్నప్పటికీ ఎక్కడ మార్పు మాత్రం రావడం లేదు. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. నెలలు నిండని పసికందును నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడంలేదు కామాంధులు. వాళ్ల కామం తీర్చుకోవడమే లక్ష్యంగా రాక్షసుల్లా  మీద పడి పోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు... మృగాళ్ల మరి కామవాంఛ తీర్చుకుంటున్నారు.



 ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో జరిగాయి. పోలీసులు మహిళలకు రక్షణ చర్యలు ఎన్నో  చేపట్టినప్పటికీ... కామపిశాచిల్లా మారుతున్న మగాళ్ల నుండి  మహిళలపై ఆకృత్యాలు  ఆగడం లేదు. తాజాగా  ఒడిషా లో దారుణం జరిగింది. ఓ యువతిని కార్లు రేప్ చేసే అత్యంత దారుణ స్థితిలో ఆమె  కాలేజీ వద్ద పడేసి వెళ్లిపోయారు. ఒడిషాలోని ఖుర్దా జిల్లాలో  ఈ ఘటన జరిగింది. ఓ యువతి బస్టాప్ లో ఉండగా... ఆ యువతి పై కన్నేసిన ఓ వ్యక్తి కారులో వచ్చి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అయితే కాలేజ్ టైం దగ్గర పడుతుండడంతో అందుకు అంగీకరించింది యువతి. 



 అనంతరం ఆ యువతి కాలేజీ వద్ద దారుణమైన స్థితిలో కనిపించింది. ఆ యువతి శరీరం మీద మొత్తం గాట్లు.... ఎక్కడికక్కడ చిరిగిపోయిన దుస్తులతో... ఆ యువతి చదువుతున్న కాలేజీ రోడ్డుపక్కనే జీవచ్చవంలా పడిపోయి ఉంది . అటువైపుగా వెళ్తున్న స్థానికులు రోడ్ పక్కన పడిఉన్న యువతిని  గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... రోడ్డు పక్కనే పడి ఉన్న ఆ యువతిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కారులో యువతిపై ఒక్కరే అత్యాచారం చేశారా.... లేక చాలా మంది కలిపి ఆ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారా అనే  కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. కాగా బాధిత యువతి ప్రస్తుతం షాప్ లో ఉందని... ఆ యువతి కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: