సమాజంలో రోజురోజుకూ ఆడవాళ్లకు రక్షణ కరువయ్యింది. ఆడది కనిపిస్తే చాలు రాక్షసులుగా మారి మీద పడి పోతున్నారు మృగాల్లాంటి మొగాళ్ళు . రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి . బయట వారి నుండే  కాకుండా ఇంట్లో వాళ్ల నుండి కూడా  మహిళలకు కనీస రక్షణ కరువైంది. బయట తిరిగే ఆకతాయిల  నుండే కాదు... సొంత వారు సైతం కామపిశాచుల్లాగా మారీ  మహిళలపై  లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఇక విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే... వక్ర  బుద్ధితో ఆలోచించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో ఓవైపు బయటి ఆకతాయిలతో...  మరోవైపు సొంత వారితో... ఇంకోవైపు విద్యాబుద్దులు నేర్పే గురువులతో... ఇలా అందరి తో మహిళలకు రక్షణ ఎక్కడ లేకుండా పోయింది. 



 తాజాగా గుజరాత్ లో  ఓ  అవమానియ  ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు టీచర్లు మృగాల్లా  మారి 15 ఏళ్ల బాలికపై కామవాంఛను తీర్చుకున్నారు. ఇక నాలుగు నెలలపాటు ఆ బాలికపై అఘాయిత్యానికి  ఒడి కట్టారు ఆ కర్కశ గురువులు. తాజా  ఘటనతో సభ్యసమాజం తలదించుకుంది . గుజరాత్ లోని  పటాన్ జిల్లాకు చెందిన ఓ అంద  బాలిక ఆర్థిక స్థితి సరిగ్గా లేక... అంబాజీ అనే పట్టణంలో ఓ  ట్రస్ట్ నిర్వహించే హాస్టెల్లో  చేరింది. 15 ఏళ్ళ అంద  బాలికపై కామ వాంఛ  పెంచుకున్నారు అక్కడి అంధులైన టీచర్లు. దీంతో అందుల హాస్టల్లో ఆ బాలికపై ఇద్దరు టీచర్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఏకంగా నాలుగు నెలల పాటు  బాలికపై అంధులైన టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 



 కాగా  అత్యాచారానికి పాల్పడ్డ అంధులైన టీచర్లలో ఒకరు 62 ఏళ్ల వృద్ధుడు కావడం నిజంగా అవమానీయం . అయితే ఇటీవల దీపావళి పండుగ నేపథ్యంలో ఆ పదిహేనేళ్ల బాలిక తన సొంత ఊరికి వెళ్ళింది. అయితే పండగ తర్వాత మళ్లీ హాస్టల్ కు  వెళ్లేందుకు నిరాకరించింది బాలిక. కాగా  ఎందుకు వెళ్ళవు అంటూ ఆ బాలికను బంధువు నిలదీయగ ... బాధిత బాలిక భోరున ఏడుస్తూ అసలు నిజం బయట పెట్టింది. హాస్టల్ లో ఇద్దరు టీచర్లు తన మీద జరుపుతున్న లైంగిక దాడి గురించి తెలిపి కన్నీరు పెట్టుకుంది ఆ అంద  బాలిక. దీంతో ఆ బాలిక  తరుపున పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఆ అంధులైన ఇద్దరు టీచర్లు హాస్టల్ నుంచి పరారయ్యారు. సభ్య సమాజం తలదించుకునే ఈ అవమానియా  ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: