దేశంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయింది....ఒంటరిగా ఉండకండి...అపరిచుతులని నమ్మకండి అని ప్రచారం చేసినప్పటికీ రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయే తప్పితే తగ్గట్లేదు.కన్న బిడ్డల్ని సైతం వదలట్లేదు కామాంధులు. ఇక ఒంటరిగా దొరికిన ఆడపిల్లని ఎలా వదులుతారు చెప్పండి.

సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు, పెప్పర్ స్ప్రై ... అంటూ ఎన్నో రకాలుగా ఆడపిల్లల్లో చైతన్యం కలిగిస్తున్నారు తప్పితే... నేరం చేసే దుర్మార్గుల ఆలోచనలలో మాత్రం మార్పు తేలేకపోతున్నారు.జరగకూడని ఘోరం జరిగిపోయాక ఆడపిల్లలు డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటే... కొందరు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు.తాజాగా ఒడిశాలోని ఖుర్దు జిల్లాలో మరో  దారుణం జరిగింది. బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతికి లిఫ్టు ఇస్తానని చెప్పి  కారులో ఎక్కించుకొని ఆమెపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. 


ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భువనేశ్వర్‌ డీసీపీ అనూప్‌ కె సాహూ ఈ ఘటనపై మాట్లాడుతూ..  ఖుర్ధా జిల్లాలోని PN కాలేజీ సమీపంలో ఓ యువతి ఒంటి నిండా గాయాలతో, చిరిగిన దుస్తులతో రోడ్డుపక్కన పడి ఉన్నట్టు సమాచారమందిందని చెప్పారు. వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా ఆమె అత్యాచారానికి గురైందని గుర్తించామని, వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

దీనికి కారణం తెలుసుకొని ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. కదులుతున్న కారులోనే ఆమె అత్యాచారానికి గురైందని కుర్దా గ్రామీణ ఎస్పీ అజయ్‌ ప్రతాప్‌ స్వైన్‌ అన్నారు. ఈ ఘటనతో యువతి తీవ్ర షాక్ కి గురైందని, ప్రస్తుతం  జిల్లా ఆస్పత్రిలో  ఆమెకు చికిత్స జరుగుతోందని చెప్పారు. బాధితురాలు కోలుకున్నాకే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు.దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: