మిలియన్ మార్చ్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావాలని
అశ్వత్థామరెడ్డి కోరారు. ఈరోజు హైకోర్టులో
ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ లో విశ్వేశ్వరరావు అనే వ్యక్తి
తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు నిలిపివేయాలని పేర్కొన్నాడు. విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వానికి సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు సూచించింది.
ఆర్టీసీ కార్మికుల
సమ్మె 35వ రోజుకు చేరింది. సీఎం
కేసీఆర్ డెడ్ లైన్ విధించటంతో విధుల్లో చేరిన కార్మికులు కొందరు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.