అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయంచేసే క్రమంలో తెలుగుదేశంప్రభుత్వ హయాంలోనే ఏజెంట్లకు, డిపాజిటర్లకు నిధులివ్వడానికి అన్నీసిద్ధంచేసి, వంటంతా తయారుచేస్తే,
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేవలం వడ్డనతో సరిపెట్టి, అంతాతానే చేసినట్లు చెప్పుకుంటు న్నాడని
టీడీపీ సీనియర్నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవాచేశారు. అగ్రిగోల్ట్ సమస్యను గుర్తించి, కోర్టుపర్యవేక్షణలో బాధితులకు న్యాయంచేయడానికి ఆ సంస్థ ఆస్తులను వేలంవేసి, తద్వారా వచ్చినమొత్తాన్ని కోర్టుకు జమచేసింది తెలుగుదేశం ప్రభుత్వమైతే, అంతాతామే చేసినట్లు వైసీపీనేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
న్యాయ స్థానం ఆదేశాలప్రకారం పంపిణీచేయడానికి బడ్జెట్లోనిధులు కేటాయించిన తెలుగుదేశం ప్రభుత్వంపై
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్మార్గపుప్రచారం చేస్తున్నారన్నారు. ఒక ప్రైవేట్సంస్థ ప్రజలను మోసగిస్తే, బాధితులపోరాటాన్ని గమనించి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదన్న సదుద్దేశంతో నాటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసువిచారణను సీబీసీఐడికి అప్పగించారని ఆనందబాబు తెలిపారు. కేసువిచారణ త్వరితగతిన జరిగేలా చూడటమేగాక, సంస్థ ముసుగులో ప్రజల్ని మోసంచేసినవారిని జైళ్లకుకూడా పంపడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని సీజ్చేసి, కోర్టుపర్యవేక్షణలో ఉంచిన తెలుగుదేశం ప్రభుత్వంపై బురదజల్లాలని చూడటం ప్రభుత్వాధినేతకు తగదన్నారు. న్యాయస్థానంలో కేసువిచారణ జరుగుతున్నందున అగ్రిగోల్డ్ బాధితులకు నిధులుచెల్లింపులో జాప్యం జరిగిం దని నక్కా చెప్పారు.
ఎన్నికలకు ముందు బాధితులకు న్యాయంచేయడానికి రూ.10వేల లోపు డిపాజిటర్లకు చెల్లింపులుచేయడానికి రూ.250కోట్లను కోర్టుకి అందచేయడం కోసం నిధులు కూడా విడుదలచేశామన్నారు. వాటితోపాటు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులవేలం ద్వారా వచ్చిన మరికొంత మొత్తాన్ని కూడా కలిపి, మొత్తం రూ.363కోట్లు బాధితులకు ఇవ్వడానికి సిద్ధంచేశామన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీప్రభుత్వం విడుదలచేసిన రూ.363కోట్లలో రూ.250కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకిచ్చి, అంతాతానే చేసినట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. టీడీపీప్రభుత్వం విడుదలచేసిన నిధులన్నీ బాధితులకు ఇవ్వకుండా కొంతకాజేసిన ప్రభుత్వం టీడీపీపై ఆరోపణలు చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం ప్రభుత్వం సంరక్షించిందని, ఆత్మహత్యచేసుకున్న 100 మందికి పైగా డిపాజిటర్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించిం దన్నారు.
ప్రైవేట్సంస్థ చేసిన మోసానికి ఏ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోలేదన్నారు. 13 జిల్లాల్లో క్యాంపులు నిర్వహించి, అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించి, నిధులు ఇవ్వడానికి
టీడీపీ ప్రభుత్వం సర్వంసిద్ధంచేశాక, అధికారంలోకి వచ్చిన జగన్, కేవలం చెక్కులు చేతికిచ్చాడని, దానిలోకూడా పక్షపాతం చూపాడని ఆనందబాబు స్పష్టంచేశారు. తెలుగుదే శం ప్రభుత్వం తయారుచేసిన జాబితాలో టీడీపీకి చెందినవారంటూ కొంతమందిపేర్లను తొలగించారన్నారు. అధికారమిచ్చిన ప్రజలకోసం పనిచేయకుండా, ప్రతిపనిలో తెలుగుదే శంపై నిందలేస్తూ, పబ్బం గడుపుకోవడం వైసీపీప్రభుత్వానికి దినచర్యగా మారిందన్నారు.పోలవరం రివర్స్టెండరింగ్ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి కోర్టునుంచి మరోసారి అక్షింత లు పడ్డాయని, హైడల్ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలచ్చిందని నక్కా తెలిపారు. గందరగోళ నిర్ణయాలతో ప్రాజెక్ట్ పనులు ఆపేసిన ప్రభుత్వం, కుంటిసాకులు చెబుతూ, స్వార్థరాజకీయాలతో తమవాళ్లకు టెండర్లు అప్పగించిందన్నారు. హైడల్ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలన్న కోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తంచేస్తున్నామన్న ఆనందబాబు ప్రభుత్వం ఇప్పటికైనా దుందుడుకు నిర్ణయాలు విడనాడాలన్నారు.