అయోధ్య వివాదం.. రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్లో ఉన్న వివాదం. 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగియగా.. నేడు(09
నవంబర్ 2019) అంశంపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతుంది.
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తీర్పు ఇది. ఈ రోజు ఏం జరుగుతుందా? ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలో ఎలాంటి తీర్పును వినవలసి వస్తుంది అని అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది సేపట్లో ఈ వివాదానికి సమాధానం రానుంది. ఉదయం 10గంటల 30 నిముషాలకు తీర్పును వెల్లడించబోతున్నారు.
అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాల నుంచి వివాదం నడుస్తుంది. 1992
డిసెంబర్ 6న హిందువులు కొందరు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా హిందువులు భావించారు.
అయోధ్య నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ ను విధించారు. అయోధ్యపై సుప్రీం తీర్పుతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా డిసెంబర్-10,2019వరకు అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. 1959:
అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాండా సంస్థ.
1981:
అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 1990: అప్పటి
బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు.1992:
డిసెంబర్ 2న బాబ్రీ మసీదును కూల్చివేసిన కర సేవకులు. 2010:
డిసెంబర్ 30న వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ
అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలసిమెలసి నిలబడదామని’
మోదీ పేర్కొన్నారు.