నగర పాలక మండలిలాస్‌ వెగాస్‌ నగరంలో ఫుట్‌పాత్‌లపై ప్రజలెవరూ పడుకోకుండా  కొత్త చట్టం తీసుకొచ్చింది. రాత్రి. పగలు తేడా లేకుండా అన్ని వేళల్లో ఫుట్‌పాత్‌లపై టెంట్లు వేసుకొని గానీ, నిద్రపోతూ ఎవరైనా కనిపిస్తే దాన్ని నేరంగా పరిగణించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. అమెరికాలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి నగరంగా కూడా లాస్‌ వెగాస్‌కు గుర్తింపు ఉంది.

గతంలో ఏదే విధంగా కొత్త చట్టాలను బాయిస్, ఇదాహో  నగరాలు ఇలాంటి చట్టాలను తీసుకరాగా అమెరికా సర్క్యూట్‌ కోర్టులు వీటిని కొట్టివేశాయి.
ఈసారి ఇక్కడ అలా జరగదని  ఫుట్‌పాత్‌లపై ప్రజలెవరూ పడుకోకుండా  కొత్త చట్టం జారీ చేస్తామని సిటీ అలార్నీ బ్రాడ్‌ జెర్బిక్‌ చెప్పారు. ‘ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉన్నప్పుడు’ అనే క్లాజ్‌ చట్టంలో తీసుకొచ్చామని ఆయన తెలిపారు.

పేద ప్రజలకు ఉద్దేశించిన ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉంటున్నాయని కూడా ఆయన చెప్పారు. లాస్‌ వెగాస్‌లో కేవలం పేద ప్రజలే కాకుండా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వాళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు.దీనిని ఆపాలనే ఉద్దెశంతోనే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాము అని వివరించాడు. అంతే కాకుండా  నగరంలో అద్దెలు ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు. 


అటార్నీ పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల ఈ చట్టాన్ని మినహాయించినట్లు  తెలిపారు. బుధవారం నాడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నగర పాలక మండలి ఈ కొత్త చట్టం  తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీనిని పాటించని వారిపై జరిమానా విధించబడును. జరిమానా వెయ్యి డాలర్లు అని ప్రకటించారు ఈ వెయ్యి డాలర్లు కట్టలేని వాళ్లను జైళ్లకు పంపిస్తామని చెబుతున్నారుగానీ ఎన్ని రోజులు పంపిస్తారన్నది చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: