అయోధ్య వివాదం... ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. ఎన్నో శతాబ్దాల నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ నానుతున్నదే అయోధ్య కేసు. అయితే ఈ అయోధ్య కేసుకు నేడు తెర హైకోర్టు తీర్పుతో తేరా పడనుంది. 2.27 ఎకరాల భూమి కోసం హిందు, ముస్లిం వర్గాలు 1853 నుండి భూమి నాది అంటే నాది అని వాదించుకున్నారు. అయితే దాదాపు 15 శతాబ్దాల కాలం నుండి ఈ అయోధ్య కేసుపై ఎటువంటి తీర్పు రాలేదు. అయితే నేడు తీర్పు వెలువడనుంది. 


అయితే ఇప్పుడు అంటే మనకు అందరికి తెలుసు ఎం జరిగింది అనేది. కానీ మొదటి నుండి అయోధ్య వివాదంలో ఎలాంటి ఘటనలు జరిగాయి అనేది ఎవరికీ తెలియదు. అయితే మెఘల్ చక్రవర్తి బాబర్ కాలం నుంచి ఇప్పటివరకు ఈ వివాదం ఎలా జరిగింది ?  ఈ వివాదం ఎలా మొదలయ్యింది ? ఇందులో కీలక ఘట్టాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 


మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ 1528లో బాబ్రీ మసీదును నిర్మించారు. అయితే మొదటిసారి 1859లో ఆ బాబ్రీ మసీదు దగ్గర మత విద్వేషాలు, గొడవలు జరిగాయి. 1859లో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతిని కల్పించారు. దీంతో 1885లో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం మొదటిసారిగా కోర్టు మెట్లెక్కింది. 


1949లో మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు దీంతో మరోసారి అక్కడ అల్లర్లు మొదలైయ్యాయి, 1959లో అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని నిర్మోహి అఖాండా సంస్థ కోర్టును ఆశ్రయించింది. 1981లో అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున వారు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 


1984లో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. దీంతో 1986 ఫిబ్రవరి 1న హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.1989లో బాబ్రీ మసీదు వద్ద రామమందిర నిర్మాణానికి వీహెచ్‌పీ పునాదిరాయి వేసింది. 1990లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు.


1992 డిసెంబర్ 2న బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేశారు. 2010 డిసెంబర్ 30న వివాదాస్పదంగా 2.77 ఎకరాల భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పుపై 2011లో సుప్రీం కోర్టు స్టే విధించింది. 2017 ఆగష్టు 7న అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్లను దాఖలు చేసింది. 2018 జులై 20న అయోధ్య తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి 2019 మార్చిలో మధ్య వర్తుల కమిటీని కూడా సుప్రీం కోర్టు నియమించింది. అయితే ఈరోజు అయోధ్య కేసుపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: