అయోధ్య తీర్పులో సుప్రీం కోర్ట్ చారిత్రత్మక తీర్పును ఇచ్చింది. అయోధ్యలో వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం కోర్ట్ తీర్పును ఇచ్చింది. తీర్పు ని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివారు. నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాల ను పరిగణన లోకి తీసుకున్నట్టు తెలియ జేసారు. అలాగే ఈ తీర్పు పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా వెలువరిస్తున్నట్టు తెలిపారు.వివాదాస్పద స్థలం లో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలం లో ఒక నిర్మాణం ఉందన్నారు. వివాదాస్పద స్థలం లో మసీదు లేదని అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోంది అని చెప్పారు.


మరో పక్క అయోధ్యలో ఎక్కడ కూడా మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించలేదని కోర్ట్ అభిప్రాయ పడింది.   మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఈ నేపథ్యంలో  వివాదాస్పదమైన అయోధ్య రామ జన్మ భూమి స్థలం హిందువుల కే చెందుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదాని కి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్ట ప్రకారం ఏర్పాటు చేసే ఆలయ ట్రస్ట్ కు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


సుప్రీం కోర్ట్ .. అయోధ్య ట్రస్ట్ ను మూడు నెలల్లో ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అలాగే అదే సమయం లో ముస్లిం మత విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ అయెధ్య లోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే మత విశ్వాసాల ఆధారంగా కాకుండా పురావస్తు శాఖ నివేదిక ప్రాతిపదికనే సుప్రీం ధర్మాసనం ఏక గ్రీవ తీర్పును వెలువరించినట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: