అయోధ్యలో వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉండేదని పురావస్తు విభాగం చెబుతోందని సుప్రీంకోర్టు తెలియచేయడం జరిగింది. సుప్రీంకోర్టు తమను తీవ్రంగా నిరాశపరిచిందని, అయినప్పటికీ కూడా  మేము గౌరవిస్తామని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది.  అయోధ్యలో తమకు ఐదు ఎకరాలు అవసరం లేదని స్పష్టం తెలియచేసింది.


చాల  ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి శనివారం సుప్రీంకోర్టు తెరదించిన సంగతి అందరికి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయించాలని, మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని, ముస్లింలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసాడు.

ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, గతంలో రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు కూడా చేసేవారు అని తెలియచేయడం జరిగింది.  ఇక తీర్పు సమయంలో మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు అసలు లేదు అని, అక్కడ హిందు నిర్మాణం ఉండేదని పురావస్తు విభాగం చెబుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ స్థలంపై మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డ్ నిరూపించలేక పోయింది అని, శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు ఉన్నాయి అని తెలిపింది.


 గతంలో కూడా అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టడం జరిగింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని తెలిపింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని అయోధ్య ట్రస్ట్ కు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: