మూడు దశాబ్దాల నుంచి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న అయోధ్య బాబ్రీ మసీదు కేసుకు ఎట్టకేలకు తెరపడింది. ఐదుగురు  సభ్యులతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ఈ  వివాదంపై తీర్పును వెలువరించింది. అయోధ్య వివాదాస్పద భూమి తమదేనని ముస్లిం సంస్థల నిరూపించుకోలేకపోవడంతో... ఆ స్థలాన్ని రామజన్మభూమి న్యాస్ కు అప్పగించింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అనుకున్న  హిందువుల కల నెరవేరనుంది. కాగా  ఈరోజు 10:30 గంటలకు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో ధర్మాసనం తీర్పు కాపీని ఓపెన్ చేయగా...  అనంతరం తీర్పు పాఠాన్ని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దాదాపు అరగంట పాటు చదివి వినిపించారు. అయితే వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్ కి చెందుతుందని అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. 



ఇక  రామమందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీమ్ కోర్టు . ముస్లింలకు మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే  సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం కేటాయించాలని సూచించింది. కేంద్రం లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సున్ని వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించే  బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. కాగా  వివాదాస్పద అయోధ్య స్థలం పై హక్కు  తమదేనని  నిర్మోహి  అఖాడా  దాఖలు చేసిన పిటిషన్ను కూడా కొట్టివేసింది ధర్మాసనం. అయితే సెక్షన్  142 ప్రకారం అయోధ్య  ట్రస్టులో నిర్మోహి  అఖాడా కు  కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలి అంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే 1528 లో బాబర్ మసీదు నిర్మించాడు అన్న విషయాన్నీ సుప్రీమ్ కోర్టు సమర్థించింది . అయితే బాబర్ మసీదు ను ఖాళీ స్థలంలో నిర్మించలేదని  కట్టడం కింద మరో మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది  సుప్రీంకోర్టు. పురావస్తు శాఖ నివేదికలో  ఆ ప్రాంతంలో మసీదుకు సంబందించిన  నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. 



 కాగా  1885 ముందు అక్కడ హిందువులు కూడా పూజలు చేసేవారని... రామ్ చతరబుత్ర, సీత రసోయ్  దగ్గర పూజలు జరిగేవని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. వివాదాస్పద స్థలాన్ని రామ్ లల్లా  విరాజ్మన్,   నిర్మోహి  అఖాడా, సున్ని వక్ప్స్ బోర్డులకు పంచుతూ  గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అయితే వివాదాస్పద అయోధ్య స్థలాన్ని   రాముడు జన్మస్థలంగా హిందువులు విశ్వసిస్తారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదని ధర్మాసనం తెలిపింది . అయితే హిందువుల నమ్మకం నిజమైంది కాదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపిన సుప్రీంకోర్టు... ఈ నమ్మకానికి విలువ ఉందా లేదా అని తేల్చడం  కోర్టు పరిధిలోని లేదని  ధర్మాసనం స్పష్టం చేసింది. మతపరమైన న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని వివాదాస్పద అయోధ్య స్థలం పై తీర్పు వెల్లడించామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు తీర్పు పై దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: