ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నారాలోకేశ్ కార్పొరేటర్ కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువని వ్యంగాస్త్రాలు సంధించారు. స్పీకర్ వ్యవస్థను దిగజార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెడితే తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా స్పీకర్ వ్యవస్థని పూర్తిగా టీడీపీ పార్టీ నాశనం చేసిందని అన్నారు. 
 
అడ్డగోలుగా సంతలో పశువులను కొన్నట్లు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొన్నారని అదే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేశ్ మాట్లాడుతుంటే బాధేస్తోందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నారా లోకేశ్ లెటర్ రాయటం హ్యాస్పాస్పదం అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని ఇటువంటి నీచ రాజకీయాలు చేయాలని అనుకుంటే తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టాలని అనుకుంటే అది కేవలం ఒక్క నిమిషం పని అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేని దుస్థితిలో స్పీకర్ కోడెల ఉండేవారని అన్నారు. 
 
రాజకీయ మనుగడ కోసం మాత్రమే కొందరు ఇసుక రాజకీయాలు చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా పని చేస్తుందని గత ప్రభుత్వం అభివృద్ధిని పేపర్ పై మాత్రమే చూపించిందని మంత్రి పేర్కొన్నారు. వైద్యం, విద్య, తాగునీరు ప్రతి ఒక్కరికీ అందించడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందించటానికి వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: