ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడికైనా ప్రజాదరణే గీటురాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తుంటేనే.. ఆ నాయకుడికి ప్రజాదరణ ఉన్నట్టు. కానీ ప్రజాదరణతో సంబంధం లేకుండా చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. అదే ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు వంటి పదవులు. వీటికి ఆయా పార్టీలు మద్దతు తెలిపితే చాలు.. ఎమ్మెల్సీలు, ఎంపీలు అయిపోతారు.


అయితే వీరికి హోదా అయితే వస్తుంది కానీ.. జనంలో పలుకుబడి ఉండదు. పాపం.. ఇప్పుడు తెలుగుదేశం నేత నారా లోకేశ పరిస్థితి అంతే అయ్యింది. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోడవం లోకేశ్ భవితవ్యానికి అడ్డంగా మారింది. తాజాగా నారా లోకేశ్ ఏపీ స్పీకర్‌కు బహిరంగ లేఖ రాశారు. దీన్ని వైసీపీ సర్కారులో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తప్పుబట్టారు.


విజయనగరం పట్టణంలోని లీ ప్యారడైజ్‌లో నెరెడ్కో ప్రాపర్టీ షో – 2019లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ పదవిని దిగజార్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదన్నారు.


వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడని మండిపడ్డారు. అలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన చర్యలు తీసుకోలేని పరిస్థితిలో గత స్పీకర్‌ ఉండేవారన్నారు.


టీడీపీని కనుమరుగు చేయాలంటే వైయస్‌ జగన్‌కు ఒక్క నిమిషం పని అని, కానీ విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప నేత సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. లోకేష్‌ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్సీకి తక్కువ అని ఎద్దేవా చేశారు. పాపం ఎన్నికల్లో గెలవకపోయే సరికి నారా లోకేశ్ అంటే అందరికీ లోకువైపోయింది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: