ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ‘నాడు– నేడు’ కార్యక్రమంలో లో భాగంగా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనపై శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ అధికారులతో సమీక్షించారు. తొలి దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.
అందుకు గాను పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపోతే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మాధ్యమంలో బోధించాలని తొలుత నిర్ణయించినప్పటికీ, తాజగా ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తూ 1 నుంచి 6వ తరగతి వరకే ఇంగ్లీష్ బోదనను పరిమితం చేశారు.
ఇలా ఎందుకంటే.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాల్లో పదవ తరగతికి దేశ వ్యాప్తంగా కామన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులతో పోటీ పడాలంటే ఇప్పుడు 8వ తరగతిలో తొలిసారి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 7, 8, 9, 10 తరగతులకు ఎలాగో వరుసగా ఇంగ్లిషు మాధ్యమం ప్రారంభమవుతుంది. అందుకే బేసిక్ స్దాయిలో ఇంగ్లిష్ బోధన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరో విషయం ఏంటంటే 6వ తరగతి విద్యార్థి అయితే 10వ తరగతికి వచ్చే సరికి ఇంగ్లిషు బోధనను పూర్తిగా అర్థం చేసుకునే స్దాయికి చేరుకుంటాడు ఈ దృష్ట్యా తొలి దశలో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల బోధనను పరిమితం చేశారు. కాగా, ఇకపోతే ఇంగ్లిష్ ల్యాబ్ల వల్ల ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. భాషపై త్వరగా పట్టు సాధించేలా వీటిని తీర్చిదిద్దుతారు. కాబట్టి ఇంగ్లిష్ ల్యాబ్లను కూడ ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు..