ఇటీవలే ఓ వ్యక్తి ఓ ప్రైవేటు బస్సును కొనుగోలు చేసాడు. ఆ ప్రైవేటు బస్సు ద్వారా  కొంత ఆదాయాన్ని సంపాదించి ఆ వ్యక్తి  అనుకున్నాడు. కొనుగోలు చేసిన బస్సు తో వ్యాపారం చేయవచ్చును ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి ఆ వ్యక్తి ఆశలకు గండిపడింది. కొనుగోలు చేసిన వారంలోపే ఆ వ్యక్తి కి బిగ్ షాక్ తగిలింది. కొనుగోలు చేసిన బస్సు మంటల్లో కాలిపోయింది. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. హైదరాబాద్లోని కూకట్ పల్లిలో ఈ  ఘటన చోటుచేసుకుంది. 



 వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కూకట్ పల్లి  లోని ప్రశాంత్ నగర్ కు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ఇటీవలే 15 లక్షలు వెచ్చించి ఓ బస్సును కొనుగోలు చేశాడు. అయితే తాను కొనుగోలు చేసిన బస్సుకి కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉండటం... అంతేకాకుండా ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వంటివి కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో వెంకట్రావు వాటిని  పూర్తి  చేసే పనులపై బిజీ బిజీ గా  తిరుగుతున్నాడు. కాగా  తాను కొనుగోలు చేసిన బస్సును ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసాడు వెంకట్రావు. ఆ బస్సు ద్వారా మంచి వ్యాపారం చేసి ఎదగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక్కడి  వరకు అంతా బాగానే ఉన్నా... బస్సు కొన్న వారంలోపే వెంకట్రావ్ కి  ఒక పెద్ద షాక్ తగిలింది. ఆ వ్యక్తి ప్రవేట్ బస్సును  కొనుగోలు చేసి వారం రోజులు  కూడా గడవకముందే ఆ ప్రైవేట్ బస్సు మంటల్లో కాలి భూడిదయిపోయింది. 



 వెంకట్రావు బస్సు ను కొనుగోలు చేసి ఓ ఖాళీ స్థలంలో  పార్క్ చేయగా...  నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో బస్సు నుంచి పొగలు వస్తుండటాన్ని  స్థానికులు గమనించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అగ్నిమాపక  సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే ఆ బస్సు పూర్తిగా దగ్దమైపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న బస్సు యజమాని వెంకట్రావు పూర్తిగా కాలిబూడిదైపోయిన బస్సు ను చూసి లబోదిబోమన్నాడు. తనపై కక్ష తో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వెంకట్రావు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: