సమాజంలో రోజురోజుకూ మానవత్వం మంటగలిసి పోతుంది. సాటి మనిషి పై జాలి చూపించడం మాని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు సాటీ  మనుషులు. చిన్న చిన్న విషయాలకి రాక్షసులుగా మారిపోతున్న మనుషులు సాటి  మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. దీంతో రోజురోజుకీ మనిషి ప్రాణానికి విలువ తగ్గిపోతుంది. ఇక రోజుకో హత్యా తెర మీదికి వస్తుంది. ఇక చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు సైతం తీసుకోవడానికి వెనుకాడటం లేదు . చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి క్షణికావేశంలో హత్యలు  సంఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. 



 తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఈ హత్య దేనికోసమో  కాదండోయ్...  రెండు రూపాయల కోసం జరిగిన గొడవ కాస్త ఒక మనిషి ప్రాణం తీసే  దాకా వెళ్ళింది. రెండు రూపాయల కోసం మొదలైన గొడవతో  కోపోద్రిక్తుడైన వ్యక్తి  యువకున్ని  కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంలోని వలసపాకలో  చోటు చేసుకుంది.  సైకిల్ షాప్ లో సువర్ణ రాజు అనే యువకుడు గాలి తన వాహనంలో  కొట్టించుకున్నాడు. ఆ యువకుడు గాలి గుర్తుంచుకున్నందుకు గాను  షాపు యజమాని సాంబ రెండు రూపాయలు ఇవ్వమని అడిగాడు. దీంతో రెండు రూపాయలు ఇవ్వానంటూ  యువకుడు సైకిల్ షాపు యజమాని సాంబ తో గొడవ పడ్డాడు. అయితే వీరిద్దరి మధ్య రెండు రూపాయల కోసం మొదలైన గొడవ కాస్త పెద్దది కావడంతో సువర్ణ రాజు అనే యువకుడు సైకిల్ షాప్ యజమాని సాంబ పై చేయి చేసుకున్నాడు. 



 సువర్ణ రాజు సాంబా పై చేయి చేసుకున్న సమయంలో పక్కనే ఉన్న స్నేహితులు అప్పారావు ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కత్తితో సువర్ణ రాజును పొడిచాడు. దీంతో సువర్ణ రాజు అనే యువకుడు అక్కడికక్కడే రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ   కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సువర్ణ రాజునూ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా  రెండు రూపాయల కోసం గొడవ కాస్త ఓ యువకుని ప్రాణాల మీదికి రావడంతో ఈ ఘటనపై స్థానికులు అందరూ షాక్ కి  గురవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: