రోజు రోజుకు మనిషిలో స్వార్ధం ఎంతలా పెరిగిపోతుందంటే. తానొక్కడే సంతోషంగా ఉండాలనే ఆలోచనే కాని తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా తనలాగే ఆనందంగా ఉండాలని కోరుకునే వారు మచ్చుకైన కనిపించడం లేదు. మనిషిలోని మనస్సు మాయమై క్రమ క్రమంగా మృగంగా మారుతున్నారు. మానవతా విలువలను కాల్చి బూడిద చేస్తూ, తాను సమాజంలో బ్రతుకుతున్నాననే సృహలేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఈ తేడా ఆడమగ అనే బేధం లేకుండా ప్రతివారిలోని ప్రవర్తన ఇలాగే ఉంది.


ఇప్పుడొక అమ్మాయి తాను ఓ ఆడపిల్లను అన్న విషయాన్ని మరచి రాక్షసిలా మారి మరో ఆడపిల్ల ప్రాణం తీయడానికి ముందుకు వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తి దక్కలేదన్న అక్కసుతో దారుణానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అతడి ఇంటికి వెళ్లి అతని భార్య గొంతు కోసేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన అ ఘటన కలకలం రేపింది. వివరాలు పరిశీలిస్తే..


అనంతపురంలోని మహాత్మాగాంధీ కాలనీలో నివసించే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా శ్రీనివాసులు అనే యువకున్ని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించింది. అయితే ఈ విషయాన్ని మాత్రం అతడికి చెప్పకుండా ఆ  ప్రేమను తన మనసులోనే దాచుకుంది. ఈ విషయం తెలియని శ్రీనివాసులు మహేశ్వరి(19) అనే యువతిని ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.


తాను ప్రేమించిన వాడు తనను కాకుండా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాదనే విషయం తెలిసిన యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శ్రీనివాసులును తనను దక్కకుండా చేసిన మహేశ్వరిపై పగ పెంచుకుని. ఆమెను అడ్డు తొలగించుకుని అతడిని స్వంతం చేసుకోవాలని భావించి  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారైంది.


ఆ యువతి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని బాధితురాలిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు. మనిషిలోని అసూయా మనిషిని ఎంతకు దిగజార్చుతుందో ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: