కోట్ల కట్టాలకోసం.... ఆస్తులకు హత్యలు చేసే వాళ్ళని చూసి ఉంటారు. కానీ 2 రూపాయల కోసం
హత్య ఎప్పుడైనా చూసారా?బ్రహ్మం గారు చెప్పిన పోయే కాలం వచ్చిందంటే ఇదే కాబోలు .... 2 రూపాయల కోసం హత్యలు జరిగే రోజులొచ్చేశాయి.రూ.2 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన
తూర్పుగోదావరి జిల్లాకాకినాడ రూరల్ వలసపాకలో ఆదివారం చోటుచేసుకుంది.
జస్ట్ 2 రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ చినికిచినికి గాలివానగా మారింది. వివరాలు.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్లో
గాలి పెట్టుకునేందుకు సాంబ సైకిల్షాఫ్ వద్దకు వెళ్లాడు.
గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు. అయితే, అతను రూ.2 ఇవ్వకపోగా... నన్నే డబ్బులు అడుగుతావా అంటూ గద్దింస్తూ సాంబపైనే దాడికి దిగాడు. 2 రూపాయలకే కక్కుర్తిపడతావా అంటూ పరువు తీశాడు సువర్ణరాజు.
దీంతో అప్పారావు ఇగో హర్ట్ అయింది. నువ్వు అడిగితే 2 రూపాయలు కాదు కదా 2 పైసలు కూడా ఇవ్వనన్నాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు.దీంతో సువర్ణరాజు వ్యక్తిగత దూషణకు దిగాడు. అప్పటికే సహనం కోల్పోయిన అప్పారావు ఆవేశంతో కత్తిదూశాడు. తీవ్ర ఘర్షణ లో అప్పారావు సువర్ణరావుని కత్తితో పొడిచాడు. కత్తి సువర్ణరాజు ఒంట్లోకి దూసుకెళ్లడం, అతడు అక్కడికక్కడే కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయాయి.
వెంటనే స్థానికులు సువర్ణ రాజును కాకినాడలోని జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇద్దరూ పంతానికి పోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు హంతకుడిగా మిగిలిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అప్పారావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీళ్లిద్దరికీ నిత్యం పడదని, ఎప్పటికప్పుడు గొడవలు పడుతుంటారని అంటున్నారు స్థానికులు.