భారత దేశంలో అనేక దశాబ్దాల నుంచి అందరూ ఎదురు చూస్తున్న కేసులలో ముఖ్యమైన వాటిగా చెప్పుకొని వాటిలో అయోధ్య పైన తీర్పు. అలాంటి అయోధ్య కేసు ను దేశ అత్యున్నత నాయస్థానం చరిత్రకాత్మమైన తీర్పును సుప్రీమ్ కోర్టు వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం అయోధ్య పై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం అందరికి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరికలు జారీ చేశాయి. భారీ దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఏ సమయంలో నైనా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) సంస్థలకు చెందిన అధికారులు తెలియచేసారు. 


దీనిపై ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాకు సమాచారం అందింది. అయోధ్య తీర్పు ఏ రోజైనా వెలువడవచ్చనే వార్తలు బయటకి వచ్చినప్పటి నుంచి జైషే ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇప్పటికే భద్రతా దళాలకు సమాచారం అందజేశాం అని నిఘా సంస్థలు తెలిపారు. ఈ ఉగ్ర సంస్థ పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో న్యూ ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లు ప్రధానంగా ఉన్నాయి నిఘా వర్గాలు తెలిపారు.


ఈ ఏడాది ఆగస్టు 5 న జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉగ్ర మూకలు ఇలాంటి కుట్రలకు ప్రణాళికలు వేస్తూనే వస్తున్నాయి. మరో వైపు భారత భద్రతా దళాలు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి. తాజాగా అయోధ్య తీర్పు వెలువడటంతో మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: