అరవింద సమేత.. వీర రాఘవ సినిమాలో ఐదు రూపాలకోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయలకోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. కానీ సరిగ్గా అలాంటి ఘటనే కాకినాడ రూరల్‌ వలసపాకలో జరిగింది. రెండు రూపాయల కోసం హత్య చేసిన ఘటన మూడు కుటుంబాలను రోడ్డున పడేసిన వైనం అందరిని ఉలిక్కిపడేలా చేసింది.


తెలుగు రాష్ట్రాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలకు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను బలి చేస్తున్నారు. కేవలం రూ.2 కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా వలసపాకలో అందరీని కలిచి వేసింది. 


తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో ఈ దారుణం జరిగింది. వలసపాకలో సైకిల్‌ షాపులో సువర్ణరాజు గాలి కొట్టించుకున్నాడు. రెండు రూపాయల కోసం షాపు యజమాని సాంబతో గొడవపడి చేయిచేసుకున్నాడు. ఈ సమయంలో సాంబ ఫ్రెండ్ అప్పారావు అక్కడే ఉన్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఇతను..సువర్ణరాజును కత్తితో పొడిచాడు. దీంతో సువర్ణరాజు  రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.  


పోలీసులు అక్కడకు చేరుకుని సువర్ణరాజును ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ... రెండు రూపాయలు .. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మొత్తానికి రెండు రూపాయలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చెప్పుకోవడానికి కేవలం రెండు రూపాయలే. కానీ అది తెచ్చిన గొడవ.. కొట్టుకోవడమే కాదు.. రక్తాన్ని కళ్లారా చూసింది. మాటా మాటా పెరిగి.. కొట్టుకునే దాకా పోవడమే కాదు.. చంపుకునే దాకా వెళ్లిందంటే డబ్బు ఎంత పని చేయిస్తుందో అర్థమవుతోంది. కాబట్టి సొమ్ము విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోటితో పోయేదాన్ని గొడ్డలితో తెచ్చుకునే దాకా తెచ్చుకోవడం మంచిది కాదని అర్థమవుతోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: