అధికారం చేపట్టిన 5 నెలల్లోనే అడుగడుగునా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న  జగన్మోహన్‌రెడ్డి తుగ్లక్‌ పాలనపై మాట్లాడలేక.. ఎక్కడ సలహాలిస్తే ఉద్యోగం పీకేస్తాడో అన్న భయంతో వైకాపా నాయకులు నారాలోకేష్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.  ఆ భయంతోనే పేపర్లో చూసి చదవడం కూడా చేతకాని జగన్మోహన్‌రెడ్డి ఏదో తెలుగు ఉద్దారకుడైనట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. జే-ట్యాక్స్‌లతో నిండిపోయిన సూట్‌కేసు కంపెనీలు కూడా నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 

తుగ్లక్‌ పాలన చూసి విజయసాయిరెడ్డికి మతిభ్రమించినట్లుంది. అందుకే 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్మోహన్‌రెడ్డి అమాయకుడు.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చదివిన నారాలోకేష్‌ దుర్మార్గుడు అన్నట్లు మాట్లాడుతున్నారు. జగన్‌కు పాదపూజలకు అలవాటు పడిన మీకు నారాలోకేష్‌ గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది..? జగన్మోహన్‌రెడ్డి తోక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి.. నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా కేబినెట్‌ హోదా ఎలా దక్కిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జైలు జీవితంలో సహకరించాడన్న అభిమానంతో మీకు జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభ సీటు ఇచ్చారు. 


దొంగ లెక్కలు రాయడంతో ప్రారంభమైన మీ అవినీతి చరిత్ర తెలియనిదెవరికి..? మీ అధినేతకు లక్ష కోట్లు దోచుకోవడానికి దారి చూపిన మీరు.. నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన నారాలోకేష్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైకాపా నాయకులకు రోజూ నారాలోకేష్‌ దండకం చదవనిదే నిద్రపట్టడం లేదు. నారాలోకేష్‌పై విమర్శలు చేసే ముందు.. ''నిరారక్షత, దీవితం, సంఘ సస్కర్తలు, రాజిక సౌద్దన్నం..'' పదాలకు అర్థమేమిటో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పగలరా..? చూడకుండా ప్రసంగాలు చేసేవారు తప్పు మాట్లాడితేనే నోటికొచ్చిన విమర్శలు చేసే మీరు.. చూసి కూడా తప్పులు చదివే మీ అధినేతకు ఏం పేరు పెడతారో..? సమాధానం చెప్పండి.జే-ట్యాక్స్‌ ఏజెంట్‌కు ఎక్కువ.. మంత్రి పదవికి తక్కువ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా నారాలోకేష్‌పై విమర్శలు చేయడం విడ్డూరం. మీ దొంగల కేబినెట్‌కు పాలన చేతగాక 5 నెలల్లోనే రాష్ట్రాన్ని శ్మశానం చేశారు.ఐదేళ్ల పాలనలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనన్న భయంతో.. ప్రజలంతా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. మీకు చేతనైతే ముందు ఆ ప్రజలను ఆదుకోండి. అంతేకానీ నోరు ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు పారేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తగిన బుద్ధి చెబుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: